ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కట్నం వల్ల ఎన్ని ప్రయోజనాలో తెలుసా? వివాదాస్పదమవుతున్న బీఎస్సీ నర్సింగ్ పాఠ్యాంశం!

ABN, First Publish Date - 2022-04-05T16:42:12+05:30

వరకట్నం ఒక సామాజిక దురాచారం అని, కట్నం తీసుకుని పెళ్లి చేసుకోవడం నేరమని ముక్త కంఠంతో అందరూ నినదిస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వరకట్నం ఒక సామాజిక దురాచారం అని, కట్నం తీసుకుని పెళ్లి చేసుకోవడం నేరమని ముక్త కంఠంతో అందరూ నినదిస్తున్నారు. ఇటీవలి కాలంలో కట్నం లేకుండా ఎంతో మంది వివాహాలు చేసుకుంటున్నారు. అయితే వరకట్నం వల్ల ప్రయోజనాలు కూడా ఉన్నాయని బీఎస్సీ నర్సింగ్ రెండో సంవత్సరం పాఠ్య పుస్తకాల్లో పేర్కొనడం తీవ్ర వివాదంగా మారింది. టీకే ఇంద్రాణి రచించిన సోషియాలజీ ఫర్‌ నర్సింగ్‌ పుస్తకంలోని ఒక పేరాలో వరకట్నాన్ని సమర్థిస్తూ ఆమె వ్యాఖ్యలు చేశారు. 


అందవిహీన అమ్మాయిలకు మంచి అబ్బాయిలతో పెళ్లి కావాలంటే కట్నం ముట్టజెప్పాల్సిందే అంటూ ఆమె పేర్కొనడం తీవ్ర వివాదానికి కారణమైంది. అలాగే కట్నాలు ఇచ్చే స్తోమత లేకే కొందరు తల్లిదండ్రులు తమ కూతుర్లను ఉన్నత చదువులు చదివిస్తున్నారని, వారు చదివి, ఉద్యోగం సంపాదిస్తే కట్నం డిమాండ్‌ తగ్గుతుందని రాశారు. వేరే ఇంట్లోకి కొత్త కుటుంబసభ్యురాలిగా అడుగుపెట్టి వారి గౌరవం పొందేందుకు వరకట్నం ఎంతగానో సాయపడుతుందన్నారు. తన తల్లిదండ్రుల ఆస్తిలో భాగాన్ని అమ్మాయిలు కట్నం రూపంలో అత్తవారింటికి తెచ్చుకోవచ్చని పేర్కొన్నారు. 


ఈ పేరా ఉన్న పేజీ ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్రంగా వైరల్ అవుతోంది. `ఇలాంటి పాఠ్యపుస్తకాలు ఉండటం మన భారతజాతికే సిగ్గుచేటు` అంటూ శివసేన మహిళా ఎంపీ ప్రియాంకా చతుర్వేది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠ్య ప్రణాళిక నుంచి వెంటనే ఈ పుస్తకాన్ని తొలగించాలని, సంబంధికులపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు ఆమె లేఖ రాశారు. 

 

Updated Date - 2022-04-05T16:42:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising