ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూ.100 బాండ్ పేపర్‌తో అగ్రిమెంట్ చేసుకున్న వధూవరులు.. జీవితాంతం అలానే ఉంటామని సంతకాలు.. వైరల్ అవుతున్న వీడియో!

ABN, First Publish Date - 2022-03-11T18:56:22+05:30

కష్టసుఖాల్లో జీవితాంతం ఒకరికొకరం తోడుగా ఉంటామని పెళ్లిలో పంచభూతాల సాక్షిగా వధూవరులు ఇద్దరూ బాసలు చేసుకుంటారు. అయితే అతికొద్ది మాత్రమే వాటికి కట్టుబడి ఉంటారు. ఈ నేపథ్యంలో ఓ జంట వి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: కష్టసుఖాల్లో జీవితాంతం ఒకరికొకరం తోడుగా ఉంటామని పెళ్లిలో పంచభూతాల సాక్షిగా వధూవరులు ఇద్దరూ బాసలు చేసుకుంటారు. అయితే అతికొద్ది మాత్రమే వాటికి కట్టుబడి ఉంటారు. ఈ నేపథ్యంలో ఓ జంట వినూత్నంగా ఆలోచించింది. ఉమ్మడిగా కొన్ని నిబంధనలను రూపొందించుకుని.. వాటికి జీవితాంతం కట్టుబడి ఉంటామంటూ బాండ్‌ పేపర్‌పై సంతకాలు చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 



ఓ యువతి, యువకుడు ఒకరినొకరు ఇష్టపడ్డారు. దీంతో కుటుంబ సభ్యులు వారికి పెళ్లి చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారు. అయితే అందరిలా పెళ్లి చేసుకుంటే అందులో కిక్ ఏముంది అనుకున్నారో ఏమో. అందుకే వెరైటీగా ప్లాన్ చేశారు. ముందుగా రూ.100 బాండ్ పేపర్‌ను పోలిన కాగితంపై ఉమ్మడిగా కొన్ని నిబంధనలను రాసుకున్నారు. అనంతరం వాటిపై వారి పేర్లను ముద్రించుకున్నారు. పెళ్లి సందర్భంగా ఓ ఎన్వలప్ నుంచి ఆ కాగితాన్ని తీసి, అందులో ఉన్న నిబంధనలను ఒకరికొకరు చదివి వినిపించుకున్నారు. ఆ తర్వాత వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ‘రోజుకు కనీసం మూడు సార్లైనా ‘ఐ లవ్ యూ’ చెప్తాను, ఒంటరిగా అస్సలు బోన్‌లెస్ చికెన్ తినను, చివరిదాకా ప్రేమగా ఉంటాను’ అనే నిబంధనలు సదరు పేపర్‌పై ఉన్నాయి. ఈ నిబంధనలను చదువుతున్న దృశ్యాలను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అదికాస్తా వైరల్ అయింది. 






Updated Date - 2022-03-11T18:56:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising