భార్య ఆత్మహత్య చేసుకుందంటూ ఫోన్ చేసిన భర్త.. పోలీసులు వచ్చి ఆమె చేతులపై రాసింది చదివి..
ABN, First Publish Date - 2022-07-15T20:37:09+05:30
వారిద్దరికీ మూడేళ్ల క్రితం వివాహం జరిగింది.. ఇద్దరూ ఉపాధ్యాయులుగా పని చేస్తున్నారు..
వారిద్దరికీ మూడేళ్ల క్రితం వివాహం జరిగింది.. ఇద్దరూ ఉపాధ్యాయులుగా పని చేస్తున్నారు.. అయితే గురువారం ఉదయం తన భార్య ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని భర్త పోలీసులకు ఫోన్ చేసి చెప్పాడు.. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరీక్షించారు.. ఆమె చేతులపై రాసి ఉన్న సూసైడ్నోట్ను చదివారు.. భర్త ఫొటో వెనుక `నేను నమ్మకద్రోహిని కాదు` అని ఆమె రాసింది. మధ్యప్రదేశ్లోని భోపాల్లో ఈ ఘటన జరిగింది.
ఇది కూడా చదవండి..
Shocking: సమాధి నుంచి వస్తున్న శబ్దాలు విని భయపడ్డ గ్రామస్తులు.. తవ్వి తీసి చూస్తే షాక్..
భోపాల్కు సమీపంలోని గరత్గంజ్కు చెందిన ఇందు సాహు (37) అనే మహిళ మూడేళ్ల క్రితం సుభాష్ సాహును వివాహం చేసుకుంది. సుభాష్ సంగీత ఉపాధ్యాయుడు. ఇందు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలు. గురువారం ఉదయం ఇందు ఉరివేసుకుని చనిపోయిందని సుభాష్ పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆమె చేతులపై రాసి ఉన్న సూసూడ్ నోట్ చూశారు. `నా చావుకు ఎవరూ కారణం కాదు. అమ్మ, నాన్న, అన్న.. నన్ను క్షమించండి. నా మంగళసూత్రమే నా ప్రాణం తీసింద`ని ఇందు చేతుల మీద ఉంది. కాగా, ఇందు కుటుంబ సభ్యులు సుభాష్, అతని తల్లిదండ్రులపై ఆరోపణలు చేస్తున్నారు. వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సుభాష్కు వేరే మహిళతో వివాహేతర సంబంధం ఉందని, దానిని కప్పి పుచ్చుకునేందుకు ఇందుకు కూడా అఫైర్ ఉందని ప్రచారం చేసేవాడని, ఆమెను వదిలించుకునేందుకు చాలా ప్రయత్నించాడని ఇందు సోదరుడు ఆరోపించాడు. తన సోదరి మృతిపై సమగ్ర విచారణ జరగాలని డిమాండ్ చేశాడు. తన కూతురిని అల్లుడు చాలా చిత్రహింసలు పెట్టాడని ఇందు తండ్రి పేర్కొన్నారు. కాగా, ఇందు మృతదేహాన్ని పోస్ట్మార్టమ్కు తరలించిన పోలీసులు పోస్ట్మార్టమ్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Updated Date - 2022-07-15T20:37:09+05:30 IST