ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bengaluru:ప్రియురాలితో శృంగారం చేస్తుండగా 67 ఏళ్ల వ్యక్తి మృతి

ABN, First Publish Date - 2022-11-25T10:09:49+05:30

కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులోని ఘోర ఘటన జరిగింది. 67 ఏళ్ల వ్యక్తి తన ప్రియురాలితో శృంగారం చేస్తుండగా..

Bengaluru Man Dies
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు(కర్ణాటక): కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులోని ఘోర ఘటన జరిగింది. బెంగళూరు నగరంలో 67 ఏళ్ల వ్యక్తి తన ప్రియురాలితో శృంగారం చేస్తుండగా అతను గుండెపోటుతో మృతి చెందాడు.(Bengaluru Man)ఈ ఘటన సంచలనం రేపింది.ప్రియుడి ఆకస్మిక మరణంతో తాము పట్టుబడతామనే భయంతో ప్రియురాలైన(Girl Friend) ఆ మహిళ తన భర్త,(Husband) సోదరుడితో కలిసి అతని మృతదేహాన్ని జేపీనగర్ లోని ఏకాంత ప్రదేశంలో పడేసిందని పోలీసుల విచారణలో తేలింది.బెంగళూరు పోలీసులు ప్లాస్టిక్ సంచిలో 67 ఏళ్ల వ్యక్తి మృతదేహాన్ని కనుగొన్నారు. వారం తర్వాత పోలీసుల దర్యాప్తులో అసలు విషయం వెలుగుచూసింది. ప్రియురాలితో శృంగారం చేస్తున్నప్పుడు గుండెపోటుతో మరణించాడని పోలీసుల దర్యాప్తులో తేలింది.67 ఏళ్ల వ్యాపారవేత్తకు 35 ఏళ్ల పనిమనిషితో సంబంధం ఉందని పోలీసులు చెప్పారు.

ప్రియురాలి ఇంటికి వెళ్లి...

ఈ నెల 16వతేదీన వృద్ధుడైన వ్యాపారి తన ప్రియురాలి ఇంటికి వెళ్లి ఆమెతో శృంగారం చేస్తుండగా గుండెపోటుతో మంచంపైనే మృతి చెందాడు.మృతుడు జేపీ నగర్‌లోని పుట్టెనహళ్లి నివాసి బాల సుబ్రమణియన్‌గా గుర్తించారు. నవంబర్ 16న తన మనవడిని బ్యాడ్మింటన్ తరగతులకు దింపేందుకు ఇంటి నుంచి బాల సుబ్రమణియన్‌ బయలుదేరాడు. సాయంత్రం 4.55 గంటల ప్రాంతంలో బాల సుబ్రమణియన్‌ తన కోడలికి డయల్ చేసి తాను ఆలస్యంగా వస్తానని తెలిపాడు. బాల సుబ్రమణియన్‌ ఆచూకీ లేకుండా పోవడంతో అతని కుమారుడు మిస్సింగ్ ఫిర్యాదు చేశారు.

మిస్సింగ్ కేసు నమోదు

మిస్సింగ్ ఫిర్యాదు నమోదైన ఒక రోజు తర్వాత ప్లాస్టిక్ కవరు, బెడ్‌షీట్‌లో ప్యాక్ చేసి అనుమానాస్పద స్థితిలో మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు.ఈ ఘటన వెలుగులోకి వస్తే సమాజంలో తన పరువు పోతుందని భయపడిన మహిళ వెంటనే తన భర్త, సోదరుడికి ఫోన్ చేసింది. మహిళ, ఆమె బంధువులు వ్యాపారవేత్త మృతదేహాన్ని ప్లాస్టిక్ బ్యాగ్‌లో ప్యాక్ చేసి జేపీనగర్‌లోని ఏకాంత ప్రదేశంలో పడేశారు.ఆ మహిళ తన 67 ఏళ్ల ప్రియుడి మృతదేహాన్ని పారవేసినట్లు ఒప్పుకుంది.

మృతదేహానికి పోస్టుమార్టం

దీంతో పోలీసులు తనపై హత్య కేసు నమోదు చేస్తారేమోనన్న భయంతో ఇంటి పనిమనిషి భర్త, సోదరుడి సాయంతో మృతదేహాన్ని రోడ్డుపై పడేసింది.బాల సుబ్రమణ్యం తన పనిమనిషితో చాలా కాలంగా సంబంధాలు ఉన్నాయని, అతను తరచూ ఆమె ఇంటికి వచ్చేవాడని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.మహిళ చెప్పింది నిజమో కాదో నిర్ధారించడానికి వ్యక్తి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం పంపారు.

Updated Date - 2022-11-25T10:38:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising