ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నడిరోడ్డుపై షాకింగ్ సీన్.. ఎదురుగా లారీ వస్తున్నా పట్టించుకోకుండా.. !

ABN, First Publish Date - 2022-05-01T01:24:43+05:30

నడిరోడ్డుపై అరాచకం.. వీడెవడండీ బాబూ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్:  అక్కడి సీన్ చూస్తున్న వాళ్లకు అసలేం అర్థం కాలేదు..! అంతా గందరగోళం..!  అసలే ఆ రోడ్డు మీద వాహనాల రద్దీ ఎక్కువగా ఉంది. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా ప్రమాదం తప్పదు. అటువంటి రోడ్డు మధ్యలో ఓ వ్యక్తి ఎంచక్కా కూర్చున్నాడు. అతడి ముందు ఓ ప్లేటు.. అందులో ఆహారం ఉంది. పక్కనే ఓ వాటర్ బాటిల్ కూడా సిద్ధం చేసుకున్నాడు. ఇక ఆ తరువాత..  మరో ఆలోచన లేకుండా బ్రేక్‌ఫాస్ట్ చేయడం మొదలెట్టేశాడు. వాహనాలకు అడ్డంగా ఉన్నానన్న స్పృహ లేకుండా ఫుడ్‌ను ఎంజాయ్ చేశాడు. అతడి తీరుతో వాహనదారులు, పాదచారులు ఆశ్చర్యపోయారు. 


ఎదురుగా వాహనాలు వస్తున్నా అసలేమాత్రం భయపడలేదా వ్యక్తి. పక్క నుంచి పో.. అంటూ డ్రైవర్లను గద్దిస్తూ తన మానాన తాను తినేశాడు. లారీ ఎదురుగా వస్తున్న విషయాన్ని కూడా పట్టించుకోలేదు. ఇలాంటి వింత చేష్టలకు పాల్పడ్డ అతడికి మతి చెడిందా అంటే అస్సలు కాదు. ఫుల్లుగా మందేసి ఇలా నడిరోడ్డుపై తన ‘పెతాపం’ చూపించాడని స్థానికులు చెప్పారు. ఇతగాడు ఎవరనే సమాచారం లేకపోయినప్పటికీ.. ఇందుకు సంబంధించిన దృశ్యాలు మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బెంగళూరులోని శివనగర్‌లో ఇటీవలే ఈ ఘటన చోటుచేసుకుంది. 



Updated Date - 2022-05-01T01:24:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising