ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Facebook post: ప్రియురాలితో దిగిన ఫొటోను ఫేస్‌బుక్‌లో షేర్ చేసిన యువకుడు.. మరుసటి రోజే ఇలా జరుగుతుందని ఊహించలేకపోయాడు..

ABN, First Publish Date - 2022-08-20T00:07:26+05:30

వారిద్దరిదీ ఒకే ఊరు. కొన్నాళ్లుగా ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో ఆమెతో ఫొటోలు, వీడియోలు తీసుకున్నాడు. ఇటీవల ప్రియురాలితో దిగిన ఫొటోను ఫేస్‌బుక్‌లో షేర్ చేశాడు. అయితే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వారిద్దరిదీ ఒకే ఊరు. కొన్నాళ్లుగా ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో ఆమెతో ఫొటోలు, వీడియోలు తీసుకున్నాడు. ఇటీవల ప్రియురాలితో దిగిన ఫొటోను ఫేస్‌బుక్‌లో షేర్ చేశాడు. అయితే ఇదే అతడి పాలిట మృత్యుపాశంగా మారుతుందని అతను ఊహించలేకపోయాడు. మరుసటి రోజు జరిగిన అనూహ్య ఘటనతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. వివరాల్లోకి వెళితే..


బీహార్ (Bihar) రాష్ట్రం చాప్రా జిల్లా డెర్ని పరిధి.. పతర బిన్ టోలి పరిధికి చెందిన లహ్వర్ కుమార్‌కు అదే గ్రామానికి చెందిన ఓ యువతితో చిన్నప్పటి నుంచి స్నేహం ఉంది. ఎదురెదురు ఇళ్లు కావడంతో ఇద్దరి మధ్య ఇటీవల ప్రేమ వ్యవహారం (love affair) నడిచింది. ఇంట్లోని వారికి తెలీకుండా కలుసుకునేవారు. ఈ క్రమంలో ఆమెతో ఫొటోలు, వీడియోలు తీసుకున్నాడు. అయితే ఇటీవల ప్రియురాలితో దిగిన ఫేస్‌బుక్‌లో షేర్ (Facebook post) చేశాడు. దీంతో వారి ప్రేమ విషయం గ్రామం మొత్తం తెలిసిపోయింది. గురువారం రాత్రి మల విసర్జనకు వెళ్లిన లహ్వర్ కుమార్.. తిరిగి ఇంటికి రాలేదు.

Attack on girl: ఆలయం నుంచి వస్తున్న బాలిక వెనుకే వెళ్లాడు.. మర్కెట్ దగ్గరికి రాగానే వెనుక వైపు నుంచి ఒక్కసారిగా..


అర్ధరాత్రి అవుతున్నా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు కంగారుపడ్డారు. ఊరంతా వెతికినా ఆచూకీ లభించలేదు. గ్రామ సమీపంలోని నదిలో చేపల వేట కోసం జాలర్లు వలను ఏర్పాటు చేశారు. శుక్రవారం ఉదయం అందులో చేపల వలలో మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇదిలావుండగా, అదే రోజు రాత్రి లహ్వర్ కుమార్‌ ప్రియురాలి కుటుంబ సభ్యులు.. ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు. దీంతో వారే యువకుడిని హత్య చేసి ఉంటారని మృతుడి కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. వివిధ కోణాల్లో కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఆరు నెలల క్రితం అస్వస్థతకు గురైన భర్త.. ఇటీవల చెల్లెలి ఇంటికి వెళ్తున్నానని చెప్పిన భార్య.. చివరకు చేసిన పని..



Updated Date - 2022-08-20T00:07:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising