ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Shocking Incident: అమ్మాయికి 22.. అంకుల్‌కు 40.. ఈ ఘటనలో ఊహించని ట్విస్ట్ ఏంటంటే..

ABN, First Publish Date - 2022-08-11T03:11:51+05:30

పర స్త్రీ వ్యామోహం ఎప్పటికైనా చేటనే విషయాన్ని ఎన్ని ఘటనలు రుజువు చేసినా కొందరి తీరు మారడం లేదు. యువతితో వివాహేతర సంబంధాన్ని కొనసాగించి, ఆమె కోసం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: పర స్త్రీ వ్యామోహం ఎప్పటికైనా చేటనే విషయాన్ని ఎన్ని ఘటనలు రుజువు చేసినా కొందరి తీరు మారడం లేదు. యువతితో వివాహేతర సంబంధాన్ని కొనసాగించి, ఆమె కోసం భార్య నగలు దొంగతనం చేసి చివరికి కటకటాల్లో ఊచలు లెక్కబెట్టిన ఈ 40 ఏళ్ల అంకుల్ సమాజంలో మరో ఉదాహరణగా నిలిచిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా పూంతామళ్లి ముత్తునగర్ ప్రాంతానికి చెందిన శేఖర్ అనే 40 ఏళ్ల వ్యక్తి వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతని తమ్ముడు రాజా కూడా వ్యాపారంలోనే ఉన్నాడు. ఈ అన్నదమ్ములిద్దరూ పెళ్లిళ్లైనప్పటికీ తల్లితో కలిసి ఒకే ఇంట్లో ఉమ్మడి కుటుంబంగా ఉంటున్నారు.



శేఖర్‌కు, అతని భార్యకు మధ్య మనస్పర్థలు రావడంతో రెండేళ్ల క్రితం ఆమె ఇల్లు వదిలి వెళ్లిపోయింది. అయితే.. కొన్ని రోజుల క్రితం మళ్లీ ఆమె భర్త కోసం మెట్టినిట్టింకి వచ్చింది. ఆమె వచ్చి ఇంట్లో ఉన్న తన నగల కోసం చూడగా అవి కనిపించకుండాపోయాయి. ఆమె బంగారంతో పాటు తోడు కోడలి బంగారం కూడా కనిపించలేదు. దీంతో.. ఇంట్లో నగలు కనిపించడం లేదని ఆ ఇంటి కోడళ్లు ఇద్దరూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేయగా షాకింగ్ విషయం వెలుగుచూసింది. ఆ నగలను శేఖర్ కాజేసి తన స్నేహితురాలికి ఇచ్చినట్లు పోలీసుల విచారణలో తేలింది.



ఇంతకీ ఆ స్నేహితురాలు ఎవరని పోలీసులు ఆరా తీయగా ఆ యువతి పేరు స్వాతి అని, వయసు 22 సంవత్సరాలని తెలిసింది. భార్య తన నుంచి విడిపోయాక శేఖర్‌కు స్వాతితో పరిచయం ఏర్పడిందని, ఈ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసిందని విచారణలో తేలింది. ఒక హోటల్‌లో తరచుగా శేఖర్, స్వాతి కలుస్తుండే వారని తెలిసింది. స్వాతికి బంగారం ఇవ్వడం మాత్రమే కాకుండా శేఖర్ కారు కూడా కొనిచ్చాడని విచారణలో బయటపడింది. ఈ వ్యవహారం బయటపడటంతో పోలీసులు శేఖర్, స్వాతి ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. కారును సీజ్ చేశారు. ఆ బంగారం గురించి ఆరా తీస్తున్నారు. ప్రియురాలి కోసం భార్య, మరదలి నగలు దొంగతనం చేసిన శేఖర్‌ను కుటుంబ సభ్యులు అసహ్యించుకుంటున్న పరిస్థితి. ఇంటాబయటా పరువు పోగొట్టుకుని పోలీసుల అదుపులో ఉన్నాడు.

Updated Date - 2022-08-11T03:11:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising