ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డబ్బు కోసం పక్కా స్కెచ్ వేసిన భర్త.. భార్య పోలీసు కంప్లైంట్ ఇవ్వడంతో సీన్ రివర్స్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

ABN, First Publish Date - 2022-02-13T22:14:46+05:30

డబ్బు కోసం ఓ భర్త పక్కా‌ స్కెచ్ వేశాడు. ప్లాన్ ప్రకారం అన్నీ సిద్ధం చేసుకున్నాడు. అనుకున్నది అనుకున్నట్టే జరిగితే అతడి చేతికి కోటి రూపాయలు వచ్చేవి. అయితే.. భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: డబ్బు కోసం ఓ భర్త పక్కా‌ స్కెచ్ వేశాడు. ప్లాన్ ప్రకారం అన్నీ సిద్ధం చేసుకున్నాడు. అనుకున్నది అనుకున్నట్టే జరిగితే అతడి చేతికి కోటి రూపాయలు వచ్చేవి. అయితే.. భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సీన్ రివర్స్ అయింది. అసలు ఏం జరిగిందనే వివరాల్లోకి వెళితే..



హర్యానాలోని కర్నాల్ జిల్లాకు చెందిన చంద్రశేఖర్ సింగ్ క్రికెట్‌పై బెట్టింగ్‌లు పెడుతూ ఉండేవాడు. ఈ క్రమంలోనే అతడు పెద్ద మొత్తంలో డబ్బును కోల్పోయాడు. దీంతో రూ.10.50లక్షల అప్పులు చేశాడు. అప్పులు ఇచ్చిన వాళ్లు తాజాగా అతడిపై ఒత్తిడి తెచ్చారు. తమ డబ్బు కట్టాల్సిందేనని తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలోనే చంద్రశేఖర్ భారీ ప్లాన్ వేశాడు. తనను ఎవరో కిడ్నాప్ చేసినట్టు నాటకం ఆడి, అందుకు సంబంధించిన ఫొటోను భార్యకు వాట్సప్‌లో పంపించాడు. అంతేకాకుండా కోటి రూపాయలు డిమాండ్ చేశాడు. ఈ క్రమంలో భయాందోళనలకు గురైన ఆమె.. కుటుంబ సభ్యులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా రంగంలోకి దిగిన అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. విచారణంలో భాగంగా చంద్రశేఖరే కిడ్నాప్ డ్రామా ఆడి, డబ్బులు డిమాండ్ చేస్తూ తన భార్యకు మెసేజ్ చేసినట్టు గుర్తించారు. దీంతో అతడిని అదుపులోకి తీసుకున్న అధికారులు.. కేసు నమోదు చేసి జైలుకు తరలించారు.




Updated Date - 2022-02-13T22:14:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising