నెలక్రితం హైదరాబాద్కు వచ్చిన NRI.. అత్త ఫోన్కు మూడు రోజులుగా నో రెస్పాన్స్.. చివరకు బెడ్రూమ్లో షాకింగ్ సీన్!
ABN, First Publish Date - 2022-07-21T16:54:46+05:30
అనుమానస్పద స్థితిలో ఎన్నారై మృతిచెందిన సంఘటన కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని హెబ్ కాలనీలో బుధవారం వెలుగుచూసింది.
ఏఎస్రావునగర్, జూలై 20 (ఆంధ్రజ్యోతి): అనుమానస్పద స్థితిలో ఎన్నారై మృతిచెందిన సంఘటన కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని హెబ్ కాలనీలో బుధవారం వెలుగుచూసింది. నగరంలోని వెంకటేశ్వర్నగర్కు చెందిన ముకిరాల సురేష్(50) ఉద్యోగరీత్యా కొన్నేళ్ల క్రితం అమెరికా వెళ్లి భార్యాపిల్లలతో కలిసి అక్కడే స్థిరపడ్డారు. నెల రోజుల క్రితం నగరానికి వచ్చిన సురేష్.. వెంకటేశ్వర్నగర్ కాలనీలోని తన ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాడు. నాగోలు బండ్లగూడలో ఉంటున్న అత్త అయ్యగారి చంద్రకళ మూడు రోజుల నుంచి ఫోన్ చేస్తున్నా ఎలాంటి స్పందన లేదు. మంగళవారం రాత్రి అత్త చంద్రకళ వెంకటేశ్వర కాలనీలోని సురేష్ ఇంటికి రాగా, లోపలి నుంచి తలపులకు గడియవేసి కన్పించింది. ఎంత పిలిచినా పలుకకపోవడంతో స్థానికుల సహాయంతో తలుపులు తొలగించి లోపలికి వెళ్లి చూడగా సురేష్ బెడ్రూంలో మృతి చెంది ఉన్నాడు. మృతదేహం కుళ్లిపోయి ఉంది. కుషాయిగూడ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. తమ అల్లుడు కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడని, ఆ కారణంగానే చనిపోయి ఉంటాడని చంద్రకళ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
Updated Date - 2022-07-21T16:54:46+05:30 IST