ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Mahanadu: టీడీపీ నేతలు పట్టాభి, నరసింహ ప్రసాద్‌కు కువైట్‌లో ఘనస్వాగతం

ABN, First Publish Date - 2022-06-02T22:32:32+05:30

తెలుగుదేశం కువైట్ అధ్వర్యంలో జూన్ 3వ తారీఖున జరగనున్న మహానాడుకి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం, సాంస్కృతిక విభాగం అధ్యక్షులు పంతగాని నరసింహ ప్రసాద్ హాజరవుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తెలుగుదేశం కువైట్ అధ్వర్యంలో జూన్ 3వ తారీఖున  జరగనున్న మహానాడుకి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం, సాంస్కృతిక విభాగం అధ్యక్షులు పంతగాని నరసింహ ప్రసాద్ హాజరవుతున్నారు. ఈ క్రమంలో శుక్రవారం కువైట్ చేరుకున్న వారిరువురికి అక్కడి తెలుగుదేశం పార్టీ విభాగం అధ్యక్షుడు  కుదరవల్లి సుధాకర రావు ఆధ్వర్యంలో టీడీపీ సభ్యులు  ఘనస్వాగతం పలికారు. పుష్పగుచ్ఛాలతో పలువురు స్వాగతం పలికి వారి పట్ల తమకున్న అభిమనాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా సుధాకరరావు మాట్లాడుతూ  కువైట్ ఖైతాన్ ఏరియాలోని ఇండీయన్ కమ్యునిటీ స్కూల్ ఆడిటోరియంలో శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు జరగనున్న మహానాడులో తెలుగుదేశం పార్టీ అభిమానులందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. రెండు రోజుల క్రితమే రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు కూడా కువైట్ మహనాడుని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ప్రవాసాంధ్రుల సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కూడా చేపట్టనున్నారని తెలిపారు.  







Updated Date - 2022-06-02T22:32:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising