ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారతీయులకు Singapore గుడ్‌న్యూస్

ABN, First Publish Date - 2022-03-04T22:06:26+05:30

భారత పౌరులకు సింగపూర్ శుభవార్త చెప్పింది. కరోనా నేపథ్యంలో విధిస్తున్న ఆంక్షలను సడలిస్తున్నట్టు వెల్లడించింది. సవరించిన కొవిడ్ నిబంధనలు ఈ నెల 16 నుంచి అమలులోకి వస్తాయని పేర్కొంది. కాగా.. ఇం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: భారత పౌరులకు సింగపూర్ శుభవార్త చెప్పింది. కరోనా నేపథ్యంలో విధిస్తున్న ఆంక్షలను సడలిస్తున్నట్టు వెల్లడించింది. సవరించిన కొవిడ్ నిబంధనలు ఈ నెల 16 నుంచి అమలులోకి వస్తాయని పేర్కొంది. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..



చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి రూపాలు మార్చకుంటూ ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో దేశాలన్నీ ప్రయాణాలపై ఆంక్షలు విధించాయి. కఠినంగా లాక్‌డౌన్‌లను అమలు చేశాయి. అయితే కొంత కాలంగా కరోనా ఉధృతి కాస్తా తగ్గింది. దీంతో చాలా దేశాలు ప్రయాణాలపై విధించిన ఆంక్షలను తొలగిస్తున్నాయి. ఇందులో భాగంగానే సింగపూర్ కూడా తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. భారత ప్రయాణికులు వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ సింగపూర్ వెళ్లిన తర్వాత తప్పనిసరిగా క్వారెంటైన్‌లో ఉండాల్సి వచ్చేది. అయితే.. సింగపూర్ ఈ నిబంధనను ఎత్తేసింది. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న భారత ప్రయాణికులు తమ దేశంలో అడుగుపెట్టిన తర్వాత తప్పనిసరిగా క్వారెంటైన్‌లో ఉండాల్సిన అవసరం లేదని చెప్పింది. మార్చి 16 నుంచి ఈ ఆదేశాలు అమలులోకి రానున్నట్టు సింగపూర్ సీనియర్ మంత్రి ఓ మీడియా సమావేశంలో చెప్పారు. 




Updated Date - 2022-03-04T22:06:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising