ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral News: ఆయన వాడి పడేసిన టిష్యూ పేపర్.. ఆన్‌లైన్‌లో అమ్మకానికి.. ఖరీదు అక్షరాలా రూ.6.36లక్షలు!

ABN, First Publish Date - 2022-09-05T14:19:35+05:30

అతడు ప్రముఖ సింగర్. ఆయన వాడి పడేసిన టిష్యూ పేపర్ ప్రస్తుతం ఆన్‌లైన్‌లో అమ్మకానికి వచ్చింది. దాని ఖరీదు ఏకంగా రూ.6.36లక్షలట. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది నిజం. ప్రస్తుతం అందుకు సంబంధించిన ప్రకటన నెట్టింట వైరల్ అవుతోంది. ఈ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: అతడు ప్రముఖ సింగర్. ఆయన వాడి పడేసిన టిష్యూ పేపర్ ప్రస్తుతం ఆన్‌లైన్‌లో అమ్మకానికి వచ్చింది. దాని ఖరీదు ఏకంగా రూ.6.36లక్షలట. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది నిజం. ప్రస్తుతం అందుకు సంబంధించిన ప్రకటన నెట్టింట వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో నెటిజన్లు రెచ్చిపోతున్నారు. కాగా.. ఇంతకూ ఆన్‌లైన్‌లో అమ్మకానికి వచ్చిన టిష్యూ పేపర్‌ను ఉపయోగించిన సింగర్ ఎవరు.. ఏంటి అనే పూర్తి వివరాల్లోకి వెళితే..


ఆ ప్రముఖ సింగర్ పేరు మహ్మద్ అబ్దు. సౌదీ అరేబియా(Saudi singer)కు చెందిన ఈ సింగర్‌కు గల్ఫ్ దేశాల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన షోలకు హాజరయ్యేందుకు అక్కడి ప్రజలు ఎగబడతారు. కాగా.. మహ్మద్ అబ్దు.. కొన్ని నెలల క్రితం సౌదీలోని అభా(Abha) నగరంలో ఏర్పాటు చేసిన షోలో పాల్గొన్నారు. తన స్వరంతో అక్కడి ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. కార్యక్రమం అనంతరం ఓ టిష్యూ(Tissue) పేపర్‌ను ఉపయోగించాడు. ఇప్పుడు అదే ఆన్‌లైన్‌లో అమ్మకానికి వచ్చింది. 



మహ్మద్ అబ్దు వాడి పడేసిన టిష్యూ పేపర్‌ను జాగ్రత్తగా భద్రపరిచ్చిన కొందరు నిర్వాహకులు.. ఆయన అభిమానులకు దాన్ని అమ్మి క్యాష్ చేసుకోవాలని భావించారు. ఈ క్రమంలోనే టిష్యూ పేపర్ ఖరీదు 29,999 సౌదీ రియాల్‌(భారత కరెన్సీలో రూ.6.36లక్షలు)గా నిర్ణయించారు. దీన్ని కొనుగోలు చేయాలనుకునే వారికి ఓ బంపర్ ఆఫర్ కూడా ఇచ్చారు. ఈ మొత్తాన్ని ఒకేసారి చెల్లించాల్సిన అవసరం లేదట. నాలుగు విడతల్లో చెల్లించేలా వెసులుబాటు కల్పించినట్టు పేర్కొన్నారు. ఆన్‌లైన్‌లో ఈ ప్రకటన చూసిన అభిమానులు ఫన్నీగా కామెంట్స్ చేస్తూ రెచ్చిపోతున్నారు. ఇదిలా ఉంటే.. గతంలో సాకర్ దిగ్గజం లియోనల్ మెస్సీ తన ఆటకు గుడ్‌బై చెప్పిన సందర్భంగా తన కన్నీళ్లను తుడుచుకోవడానికి ఉపయోగించిన టిష్యూ పేపర్‌ ఏకంగా రూ.7.5కోట్లకు ఆన్‌లైన్ అమ్మకానికి వచ్చిన విషయం తెలిసిందే.


Updated Date - 2022-09-05T14:19:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising