NRI TRS: ఎమ్మెల్సీ కవిత ఇంటిపై దాడిని ఖండించిన ఎన్నారై టీఆర్ఎస్
ABN, First Publish Date - 2022-08-23T15:16:17+05:30
ఢిల్లీ మద్యం విధానంలో ఎమ్మెల్సీ కవితపై నిరాధారణమైన ఆరోపణలు చేయడమే కాకుండా తన ఇంటిపై దాడికి పాల్పడ్డ బీజేపీ నేతల చర్యలను ఎన్నారై టీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తుందని ఎన్నారై టీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి తెలిపారు.
లండన్: ఢిల్లీ మద్యం విధానంలో ఎమ్మెల్సీ కవితపై నిరాధారణమైన ఆరోపణలు చేయడమే కాకుండా తన ఇంటిపై దాడికి పాల్పడ్డ బీజేపీ నేతల చర్యలను ఎన్నారై టీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తుందని ఎన్నారై టీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి తెలిపారు. రాజకీయంగా టీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ను ఎదుర్కొనే దమ్ములేని బీజేపీ ఇలా ఆయన కుటుంబసభ్యులపై నిరాధారమైన ఆరోపణలను చేసి ప్రజల్లో మరింత చులకనవుతుందని అశోక్ అన్నారు. బీజేపీ ఎన్ని కుట్రలు చేసిన తెలంగాణ ప్రజలంతా కేసీఆర్ వెంటే ఉన్నారని చెప్పారు. ఇలాంటి చిల్లర ప్రయత్నాలకు కేసీఆర్ బెదిరే నాయకుడు కాదని, ఎంతో మందితో పోరాడే తెలంగాణ సాధించిన ఫైటర్ అని తెలిపారు. అలాంటి ఫైటర్ బిడ్డనే కవిత అన్నారు. ఇలాంటి చిల్లర వేషాలు ఇప్పటికైనా ఆపకుంటే రాబోయే రోజుల్లో ప్రజలు తగిన బుద్ది చెప్తారని అశోక్ తెలిపారు.
Updated Date - 2022-08-23T15:16:17+05:30 IST