ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Malaysia వెళ్లాలనుకుంటున్న భారతీయులకు గుడ్ న్యూస్.. జూన్ 1వ తారీఖు నుంచి..

ABN, First Publish Date - 2022-06-01T02:24:23+05:30

మలేషియా వెళ్లాలనుకుంటున్న భారతీయులకు ఓ గుడ్ న్యూస్..! ఆ దేశ ప్రభుత్వం భారత టూరిస్టుల కోసం వీసా ఆన్ అరైవల్ అవకాశాన్ని కల్పించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: మలేషియా వెళ్లాలనుకుంటున్న భారతీయులకు ఓ గుడ్ న్యూస్..! ఆ దేశ ప్రభుత్వం భారత టూరిస్టుల కోసం వీసా ఆన్ అరైవల్ అవకాశాన్ని కల్పించింది. జూన్ 1 నుంచి ఈ సౌలభ్యం అందుబాటులోకి రానుంది. దీంతో..  ముందస్తు వీసాకు బదులుగా మలేషియాకు వెళ్లాక భారతీయులు ఈ వీసా పొందవచ్చు. ఇందుకోసం 46 డాలర్ల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో టూరిస్టులు తమ వద్ద 500 డాలర్ల క్యాష్ ఉందని లేదా బ్యాంక్ అకౌంట్లో నిల్వ ఉందని నిరూపించుకోవాల్సి ఉంటుంది.  ఇక తిరుగు ప్రయాణ టిక్కెట్టు ఉన్న వారు 15 రోజుల పాటు ఆ దేశంలో గడపవచ్చు. 


మార్చి 1 నుంచి మలేషియా ప్రభుత్వం టీకాలు తీసుకున్న టూరిస్టులను క్వారంటైన్ లేకుండానే దేశంలోకి అనుమతిస్తున్న విషయం తెలిసిందే. తప్పనిసరిగా కోవిడ్ టెస్టులు చేయించుకోవాలన్న నిబంధన కూడా తొలగించింది. మరోవైపు.. మలేషియాలో ఈవీసా సౌకర్యాన్ని కూడా కల్పిస్తోంది. ఆన్‌లైన్‌లో దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. 



Updated Date - 2022-06-01T02:24:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising