ప్రతిష్టాత్మక ఆస్ట్రేలియా అవార్డు రేసులో భారత సంతతి యువతి
ABN, First Publish Date - 2022-03-13T18:56:04+05:30
భారత సంతతికి చెందిన ఆస్ట్రేలియన్ యువతి నటాషా ఝా భాస్కర్ ప్రతిష్టాత్మక 'యంగ్ ఆస్ట్రేలియన్ ఇన్ ఇంటర్నేషనల్ ఎఫైర్స్ 2022' అవార్డు రేసులో ఉంది.
కాన్బెర్రా: భారత సంతతికి చెందిన ఆస్ట్రేలియన్ యువతి నటాషా ఝా భాస్కర్ ప్రతిష్టాత్మక 'యంగ్ ఆస్ట్రేలియన్ ఇన్ ఇంటర్నేషనల్ ఎఫైర్స్ 2022' అవార్డు రేసులో ఉంది. ఈ అవార్డు కోసం తాజాగా ప్రకటించిన 25 మందితో కూడిన తుది జాబితాలో నటాషా కూడా చోటు దక్కింది. ప్రభుత్వ, ప్రైవేటు రంగాలకు చెందిన వివిధ విభాగాల్లో పనిచేసే ప్రతిభావంతులైన మహిళలను ఈ అవార్డు కోసం ఎంపిక చేస్తారు. కాగా, సిడ్నీలో నివాసముండే నటాషా ప్రస్తుతం ఆస్ట్రేలియాలోని న్యూలాండ్ గ్లోబల్ గ్రూప్(ఎన్జీజీ) జనరల్ మేనేజర్ హోదాలో పబ్లిక్ పాలసీ ఎక్స్పర్ట్గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె భారత్-ఆస్ట్రేలియా ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడి సంబంధాల విషయంలో చాలా కీలకంగా వ్యవహరించారు. ఇండియన్ పార్లమెంట్ పాలసీకి సంబంధించి నటాషాకు పన్నెండేళ్ల అనుభవం ఉంది. నటాషా మాట్లాడుతూ.. చాలా మంది ప్రతిభావంతులైన మహిళల జాబితాలో తనకు స్థానం లభించడం గౌరవంగా భావిస్తున్నానన్నారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ వ్యవహారాల్లో యువ ఆస్ట్రేలియన్ల గుర్తింపుకు ఆమె ధన్యవాదాలు తెలిపారు.
Updated Date - 2022-03-13T18:56:04+05:30 IST