ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా ఎఫెక్ట్.. రిపబ్లిక్ డే వేడుకలపై Kuwait లోని భారత ఎంబసీ కీలక ప్రకటన!

ABN, First Publish Date - 2022-01-21T16:55:48+05:30

కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో తాజాగా కువైత్‌లోని భారత రాయబార కార్యాలయం రిపబ్లిక్ డే వేడుకలపై కీలక ప్రకటన చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కువైత్ సిటీ: కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో తాజాగా కువైత్‌లోని భారత రాయబార కార్యాలయం రిపబ్లిక్ డే వేడుకలపై కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవాన్ని వర్చువల్‌గా నిర్వహించనున్నట్లు ప్రకటించింది. కోవిడ్-19 ప్రొటోకాల్, నిబంధనలను అనుసరిస్తూ 2022 జనవరి 26న వర్చువల్ విధానంలో రిపబ్లిక్ డే నిర్వహిస్తామని రాయబారి సీబీ జార్జ్ వెల్లడించారు. కనుక బుధవారం(జనవరి 26) నాడు భారత ప్రవాసులు ఎవరూ ఎంబసీ వద్దకు రావొద్దని తెలిపారు. ఆ రోజు ఉదయం 9 గంటలకు రాయబారి భారత జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సందేశాన్ని చదివి వినిపిస్తారని ఈ సందర్భంగా ఎంబసీ పేర్కొంది.


ఇక ఆన్‌లైన్ వేదికగా జరిగే ఈ 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఎంబసీకి సంబంధించిన అన్ని సోషల్ మీడియా సైట్స్‌లో ప్రత్యక్షప్రసారం చేయనున్నారు. కనుక భారత ప్రవాసులు బుధవారం ఉదయం 9 గంటల నుంచి ఈ లైవ్‌లో జాయిన్ కావొచ్చని రాయబార కార్యాలయం వెల్లడించింది. జూమ్‌లో https://zoom.us/j/91063589125?pwd=SlpnWmZsWG9SSHF5RTFZd2hPU2Ezdz09 లింక్ ద్వారా జాయిన్ కావొచ్చని ఎంబసీ తెలిపింది.     

Updated Date - 2022-01-21T16:55:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising