ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వాషింగ్టన్ డీసీలో యోగా సెషన్.. వందల సంఖ్యలో పాల్గొన్న ఔత్సాహికులు..!

ABN, First Publish Date - 2022-06-20T02:08:39+05:30

భారతీయ రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో శనివారం వాషింగ్టన్ స్మారక స్థూపానికి సమీపంలో ఏర్పాటైన యోగా సెషన్‌కు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. భారతీయ సంతతి వారే కాకుండా.. అమెరికా అధికారులు, కాంగ్రెస్ సభ్యులు, వివిధ రంగాలకు చెందిన..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: భారతీయ రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో శనివారం వాషింగ్టన్ స్మారక స్థూపానికి సమీపంలో ఏర్పాటైన యోగా సెషన్‌కు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. భారతీయ సంతతి వారే కాకుండా.. అమెరికా అధికారులు, కాంగ్రెస్ సభ్యులు, వివిధ రంగాలకు చెందిన వృత్తినిపుణులు మీడియా వారు వందల సంఖ్యలో పాల్గొన్నారు.యూఎస్ నేషనల్ సైన్స్ ఫౌండేషన్ డైరెక్టర్ డా. సేతురామన్ పంచనాథన్ ఈ ఈవెంట్‌కు గౌరవ అతిథిగా హాజరయ్యారు. ప్రపంచానికి భారత్‌ ఇచ్చిన గోప్ప బహుమతి యోగా అని డా. సేతురామన్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. వివిధ ప్రాంతాలని ఏకీకృతం చేసే శక్తి యోగాకుందన్నారు. మనసు, శరీరం మధ్య సమన్వయం సాధించడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందన్నారు. కాగా.. ఈ యోగా సెషన్లో అనేక మంది ఔత్సాహికులు పాల్గొని యోగాసనాలు వేశారు. యోగా ద్వారా శారీరక, మానసిక, ఆధ్యాత్మిక పురోగతి సాధ్యమవుతుందని అమెరికాలోని భారతీయ రాయబారి తరణ్‌జిత్ సింగ్ పేర్కొన్నారు.

Updated Date - 2022-06-20T02:08:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising