US: వలస విషాదం.. ట్రక్ ట్రాలీలో ఊపిరాడక 50 మంది మృతి
ABN, First Publish Date - 2022-06-29T13:27:17+05:30
అమెరికాలో అంతులేని విషాదం చోటుచేసుకుంది. మెక్సికో నుంచి అక్రమంగా అమెరికాలోకి చొరబడే ప్రయత్నంలో 50 మంది ట్రక్ కంటెయినర్లోనే ప్రాణాలు కోల్పోయారు.
కంటెయినర్లోనే ఆగిన ఊపిరి!
శాన్ ఆంటోనియో, జూన్ 28: అమెరికాలో అంతులేని విషాదం చోటుచేసుకుంది. మెక్సికో నుంచి అక్రమంగా అమెరికాలోకి చొరబడే ప్రయత్నంలో 50 మంది ట్రక్ కంటెయినర్లోనే ప్రాణాలు కోల్పోయారు. నలుగురు చిన్నారులు సహా 16 మంది అపస్మారక స్థితికి చేరుకోవడంతో వారిని ఆస్పత్రికి తరలించారు. టెక్సా్సలోని శాన్ ఆంటోనియాలో ఈ విషాదం చోటుచేసుకుంది. శాన్ ఆంటోనియోలోని ఓ భవనం వద్ద డ్రైవర్ ట్రక్కును రోడ్డుపక్కన వదిలేసి వెళ్లిపోయాడు. సోమవారం సాయంత్రం ఆ ట్రక్కు నుంచి సాయం కోసం కేకలు వినిపించడంతో.. ఓ కార్మికుడు అక్కడకు వెళ్లి చూడగా కొందరు విగతజీవులై, మరికొందరు అపస్మారక స్థితిలో పడి ఉన్న దృశ్యం కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసు అధికారులు వచ్చి కంటెయినర్లో విగతజీవులుగా పడిఉన్న వారిని కిందకి దించారు. ఊపిరాడక అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన 16 మందిని ఆస్పత్రికి తరలించారు
Updated Date - 2022-06-29T13:27:17+05:30 IST