వరదరాజస్తవము
ABN, First Publish Date - 2022-03-18T05:30:00+05:30
సకల శాస్త్ర పారంగతుడిగా ఖ్యాతి పొందిన అయ్యప్ప దీక్షితులు 16వ శతాబ్దానికి చెందిన గొప్ప కవి. పండితుడు. శతాధిక గ్రంథకర్త. ఆదిశంకరుల అద్వైత సిద్ధాంతాన్ని ఆకళింపు చేసుకున్న....
సకల శాస్త్ర పారంగతుడిగా ఖ్యాతి పొందిన అయ్యప్ప దీక్షితులు 16వ శతాబ్దానికి చెందిన గొప్ప కవి. పండితుడు. శతాధిక గ్రంథకర్త. ఆదిశంకరుల అద్వైత సిద్ధాంతాన్ని ఆకళింపు చేసుకున్న దీక్షితులు శ్రీ వైష్ణవ సిద్ధాంత తత్వాలను ప్రతిబించేలా రాసిన గ్రంథం ‘వరదరాజస్తవము’. కంచిలోని వరదరాజస్వామిని కీర్తించే మధురమైన ప్రబంధం ఇది.
ఈ ప్రబంధానికి దీక్షితులే వ్యాఖ్యానం రాయటం మరో విశేషం. దీనికి ప్రముఖ పండితుడు డాక్టర్ కందాళ లక్ష్మీనారాయణ తెలుగులో ‘తత్వవేది’ పేరిట వ్యాఖ్యానం రాశారు. దీక్షితులు వరదరాజస్వామిని కీర్తించిన తీరును, ఆయన అలంకార శైలిని దర్శించాలనుకొనేవారు తప్పనిసరిగా చదవాల్సిన గ్రంథమిది. కందాళ లక్ష్మీనారాయణ వ్యాఖ్యానం సరళంగా, చదివించేలా సాగింది.
వరదరాజస్తవము- తత్వవేది
ఆంధ్రవ్యాఖ్యాన కర్త: డాక్టర్ కందాళ లక్ష్మీనారాయణ ప్రతులకు: 9985237353
Updated Date - 2022-03-18T05:30:00+05:30 IST