ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘నేను’ అంటే...

ABN, First Publish Date - 2022-08-11T05:30:00+05:30

భగవాన్‌ శ్రీ రమణ మహర్షికి శ్రీ అణ్ణామలై స్వామి ప్రత్యక్ష శిష్యులు. జాతక ప్రకారం అణ్ణామలై సన్యాసి అవుతారని తెలిసి, తండ్రి ఆయనను చదివించలేదు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గవాన్‌ శ్రీ రమణ మహర్షికి శ్రీ అణ్ణామలై స్వామి ప్రత్యక్ష శిష్యులు. జాతక ప్రకారం అణ్ణామలై సన్యాసి అవుతారని తెలిసి, తండ్రి ఆయనను చదివించలేదు. అయినా తనంతట తానే చదవడం నేర్చుకున్నారు. ఇంటి నుంచి పదిహేడేళ్ళ వయసులో పారిపోయారు. ఇరవై రెండేళ్ల వయసులో శ్రీ రమణ మహర్షి దగ్గర చేరారు. శ్రీ రమణులకు వ్యక్తిగత సహాయకునిగా ఉంటూ, ఆశ్రమంలో భవన నిర్మాణ కార్యక్రమాలను పర్యవేక్షించారు. ఇలా పదేళ్ళు గడిచిన తరువాత... మహర్షి ఆదేశం మేరకు... తన తదుపరి జీవితం అంతటినీ తత్త్వవిచారణకు అంకితం చేసి, ఆత్మ జ్ఞానం పొందారు.


అణ్ణామలై స్వామి బోధలు సూటిగా, ఆచరణాత్మకంగా ఉంటాయి. మనసు గురించి ఒక సందర్భంలో ఆయన చెబుతూ... ‘‘మనం గాఢంగా నిద్రిస్తున్న ప్రతిసారీ మన మనస్సు మాయం అవుతుంది. దాన్ని మనం కాదనలేం. మరి ఆ సమయంలో మనం పూర్తిగా లేమా? అంటే అలానూ అనలేం. అంటే మనస్సు లేకుండా మన ఉనికి సాధ్యమే. అది లేకుండా మనం ఉండగలుగుతున్నామంటే... మనస్సు, మనం ఒకటి కాదు’’ అన్నారు.


ఈ విషయం మనకు నిశ్చయంగా మన రోజువారీ అనుభవంలో రూఢీ అవుతూనే ఉంది. కానీ పొద్దున్న మనస్సు మేల్కొనడంతోనే... మనం లేచామని భ్రమపడతాం. ఇది ఎంత అజ్ఞానం! 

మెలకువ, కలత నిద్ర, గాఢ నిద్ర స్థితులను మీరు నిశితంగా గమనిస్తే... స్థితి ఏదైనా మీ ఉనికి నిరాటంకంగా కొనసాగుతుందనీ, మీ మనస్సే వచ్చి పోతూ ఉంటుందనీ మీ అనుభవంలోనే మీకు తెలుస్తుంది. ఈ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని, మీరు మరుసటిరోజు లేవగానే... మీ ఉనికిని మనస్సుతోనూ, ఆలోచనలతోనూ ముడి పెట్టకండి. కేవలం వాటిని గమనించండి. మిమ్మల్ని ఆవహించనివ్వకండి. అలా చేస్తూ పోతే కొన్నాళ్ళకు మీకు ఒక విషయం అనూహ్యంగా అనుభవంలోకి వస్తుంది. అదేమిటంటే... ‘మీరు’ అనే ఉనికి మీరు రోజూ లేచే క్రమాన్నీ, ఆలోచనలనూ దాటి, చైతన్యం అనే క్షేత్రంలో స్థిరపడుతతోంది. ఈ ఎరుక ఎంత అనూహ్యమైనదంటే... మసక చీకటిలో తాడును చూసి, పాము అని భయపడి... వెలుగులో అది తాడే అని తెలిసినప్పుడు... అప్పటివరకూ ఉన్న భయం ఎలా  కరిగిపోతుందో...  ‘చైతన్యం’ అనే వెలుగులో ‘నేను’ అనే భ్రమ, దాని తాలూకు భయాలు, వ్యాకులత, రాగద్వేషాలు అలా కరిగిపోతాయి. 


‘నేను’ అంటే ‘శరీరం, మనస్సుల కలయిక’ అనే సంకుచితమైన అవగాహన మనలో జీవితకాలంగా కరడుగట్టింది. ‘నేను’ అంటే అల్పమైన శరీరం, మనస్సు, ఆలోచనలూ కాదు... అవి ఏర్పడే క్షేత్రం అనేది తెలుసుకొని, నమ్మినట్టయితే... ఆ అజ్ఞానం నెమ్మదిగా పలుచనై... ఒకనాటికి పూర్తిగా ఆవిరైపోతుంది. అప్పుడు, ఆకాశంలో వచ్చి పోయే మేఘాలు... ఆ ఆకాశాన్ని ఏ విధంగానూ ఎలా ప్రభావితం చెయ్యవో... మీ మనస్సులో వచ్చి పోయే ఆలోచనలు కూడా మిమ్మల్ని ప్రభావితం చెయ్యవు. అప్పుడు మిగిలేది అనిర్వచనీయమైన శాంతి. 

దాసుకిరణ్‌

Updated Date - 2022-08-11T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising