ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మీరు, మీ పిల్లలు చస్తారు: పోలీసులకు నర్సింగానంద్ బెదిరింపులు

ABN, First Publish Date - 2022-01-15T00:29:39+05:30

మూడు కేసుల్లోనూ నేను ఆయన(త్యాగి)తోనే ఉన్నాను. ఆయన ఒక్కడే ఏదైనా చేశారని అనుకుంటున్నారా? త్యాగి ప్రస్తుత పరిస్థితిని అర్థం చేసుకుంటున్నారు. కానీ నేను అలా కాదు. ఎందుకంటే ఆయన మా మద్దతుతో హిందువుగా మారారు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డెహ్రడూన్: ముస్లింలపై మహాత్మగాంధీపై విధ్వేష వ్యాఖ్యలు చేసిన ధర్మ్ సంసద్ నిర్వాహకుడు యతి నర్సింగానంద్‌పై ఎఫ్ఐఆర్ నమోదు అయిన విషయం తెలిసిందే. ఇదే కేసులో ఈ మధ్యే ఇస్లాం నుంచి హిందూ మతంలోకి మారిన జితేంద్ర నారాయణ్ త్యాగి (అంతకు ముందు వసీం రజ్వీ), సాధ్వి అన్నపూర్ణలపై కూడా కేసు నమోదు అయింది. అయితే శుక్రవారం నారాయణ్ త్యాగిని అరెస్ట్ చేసేందుక పోలీసులు వచ్చారు. ఆ సమయంలో పోలీసులకు నర్సింగానంద్ బెదిరింపులు చేశారు. ‘‘మీరు, మీ పిల్లు అందరూ చస్తారు’’ అంటూ పోలీసులను ఆయన బెదిరింపులు చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


‘‘మూడు కేసుల్లోనూ నేను ఆయన(త్యాగి)తోనే ఉన్నాను. ఆయన ఒక్కడే ఏదైనా చేశారని అనుకుంటున్నారా? త్యాగి ప్రస్తుత పరిస్థితిని అర్థం చేసుకుంటున్నారు. కానీ నేను అలా కాదు. ఎందుకంటే ఆయన మా మద్దతుతో హిందువుగా మారారు’’ అని యతి నర్సింగారావు అన్నారు. ఇక భారత ర్యాజ్యంగాపై కూడా యతి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘భారత రాజ్యాంగం, సుప్రీం కోర్టు మీద మాకు నమ్మకం లేదు. ఇవి వంద కోట్ల హిందువులకు వ్యతిరేకం. వీటిని నమ్ముకున్న వాళ్లకి చావు తప్పదు. సిస్టమ్, పోలీస్, రాజకీయ నాయకులు, ఆర్మీని నమ్ముకున్న వారికి కూడా కుక్క చావు తప్పదు’’ అని యతి అన్నారు.

Updated Date - 2022-01-15T00:29:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising