ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జనేశ్వర్ మిశ్రా పార్క్ చెరువులో మహిళ మృతదేహం

ABN, First Publish Date - 2022-04-08T23:54:29+05:30

ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని ప్రఖ్యాత జనేశ్వర్ మిశ్రా పార్క్‌ చెరువులో శుక్రవారంనాడు ఒక ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్నో: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని ప్రఖ్యాత జనేశ్వర్ మిశ్రా పార్క్‌ చెరువులో శుక్రవారంనాడు ఒక గుర్తుతెలియని మహిళ మృతదేహం తేలియాడటం అక్కడి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. గోమతి నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతురాలు ఎవరనేది గుర్తించాల్సి ఉంది.


పార్కు చెరువులో మహిళ మృతదేహం కంటబడగానే సిబ్బంది పార్క్ సూపర్‌వైజర్‌కు సమాచారం ఇచ్చారు. వెంటనే ఆయన పోలీసులను అప్రమత్తం చేశారు. దీంతో గోమతి నగర్ పోలీస్ స్టేషన్ సీనియర్ అధికారులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్‌మార్గం పరీక్షల కోసం లోహియా ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలికి సమీపంలో ఏర్పాటు చేసిన సీసీటీవీల ఆధారంగా మృతురాలి ఆచూకీని గుర్తించే ప్రయత్నం జరుగుతోంది. కేసును పరిష్కరించేందుకు పార్కుకు వచ్చిన పలువురుని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, ప్రాణాలు తీసుకునేందుకే మహిళ చెరువులో దూకి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.

Updated Date - 2022-04-08T23:54:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising