ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా కేసులు, మంచు ఎఫెక్ట్ : లడఖ్‌లో tourism activitiesకు బ్రేక్

ABN, First Publish Date - 2022-01-10T16:01:04+05:30

కరోనా కేసుల పెరుగుదల, విస్తారంగా కురుస్తున్న మంచు ప్రభావం వల్ల లేహ్, లడఖ్ ప్రాంతాల్లో వింటర్ సీజన్ పర్యాటక కార్యకలాపాలకు బ్రేక్ పడింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లడఖ్ (జమ్మూకశ్మీర్): కరోనా కేసుల పెరుగుదల, విస్తారంగా కురుస్తున్న మంచు ప్రభావం వల్ల లేహ్, లడఖ్ ప్రాంతాల్లో వింటర్ సీజన్ పర్యాటక కార్యకలాపాలకు బ్రేక్ పడింది. ప్రముఖ పర్యాటక ప్రాంతమైన లేహ్ లడఖ్ ప్రాంతాల్లో ప్రతి ఏటా వేలాది పర్యాటకులు పర్యటిస్తుంటారు. ఈ ఏడాది కరోనా కేసుల పెరుగుదల, విస్తారంగా కురుస్తున్న మంచు వల్ల జిల్లాలో శీతకాలంలో పర్యాటక కార్యకలాపాలను నిలిపివేయాలని లేహ్ జిల్లా మెజిస్ట్రేట్ శ్రీకాంత్ బాలాసాహెబ్ సూసే ఆదేశాలు జారీ చేశారు. లేహ్ జిల్లాలోని జన్స్కర్ ప్రాంతంలో శీతకాలంలో చాదర్ ట్రెక్ సందర్భంగా సాహస పర్యాటకులతో కళకళలాడుతోంది. ఆదివారం లడఖ్ ప్రాంతంలో 59 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. 


దీంతో కరోనా రోగుల సంఖ్య 22,472కు పెరిగింది. లేహ్ లో 221 మంది, కార్గిల్ లో 58 మంది కరోనాతో మరణించారు. జిల్లా విపత్తు నిర్వహణ అథారిటీ చైర్‌పర్సన్‌గా ఉన్న శ్రీకాంత్ బాలాసాహెబ్ సూసే ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గత ఏడాది లేహ్ ప్రాంతంలో అధికంగా కరోనా కేసులు వెలుగుచూసిన నేపథ్యంలో ముందుజాగ్రత్తగా కరోనా వ్యాప్తి చెందకుండా నివారించేందుకు ఈ ఏడాది పర్యాటక కార్యకలాపాలను అధికారులు నిలిపివేశారు. 


Updated Date - 2022-01-10T16:01:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising