Veluruలో బైపాస్ రోడ్డు ఏర్పాటుకు పరిశీలన
ABN, First Publish Date - 2022-06-19T13:51:46+05:30
ముఖ్యమంత్రి స్టాలిన్ ఈ నెల 21వ తేదీ స్థానిక కోట మైదానంలో జరిగే కార్యక్రమంలో పాల్గొని వివిధ శాఖల ఆధ్వర్యంలో లబ్ధిదారులకు సంక్షేమ సహాయాలు
వేలూరు(చెన్నై), జూన్ 18: ముఖ్యమంత్రి స్టాలిన్ ఈ నెల 21వ తేదీ స్థానిక కోట మైదానంలో జరిగే కార్యక్రమంలో పాల్గొని వివిధ శాఖల ఆధ్వర్యంలో లబ్ధిదారులకు సంక్షేమ సహాయాలు అందించనున్నారు. ముఖ్యమంత్రి పాల్గొనే వేదిక ప్రాంగణాన్ని శనివారం మంత్రి ఏవీ వేలు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి విలేఖరులతో మాట్లాడుతూ, పట్టణంలో ట్రాఫిక్ రద్దీ నియంత్రించేలా బైపాస్ రోడ్డు ఏర్పాటు అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందన్నారు. సీఎంసీ ఆసుపత్రి ఎదురుగా సబ్ వే ఏర్పాటుచేయనున్నామని, ఇందుకు అవసరమైన స్థలాన్ని ఆసుపత్రి యాజమాన్యాన్ని కోరామన్నారు. ఒకవేళ వారు నిరాకరిస్తే ప్రభుత్వానికున్న అధికారంతో స్థలం స్వాధీనం చేసుకొని సబ్ వే నిర్మిస్తామని మంత్రి తెలిపారు. మంత్రి వెంట ఆనైకట్టు ఎమ్మెల్యే నందకుమార్, వేలూరు ఎమ్మెల్యే కార్తికేయన్, కార్పొరేషన్ మేయర్ సుజాత, కలెక్టర్ కుమరవేల్ పాండ్యన్, ఎస్పీ రాజేష్ ఖన్నా తదితరులున్నారు.
Updated Date - 2022-06-19T13:51:46+05:30 IST