ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహిళా టీచర్లను రహస్యంగా వీడియో తీసిన Headmaster.. ప్రశ్నించినందుకు రాళ్లతో దాడి!

ABN, First Publish Date - 2022-07-04T00:16:23+05:30

మహిళా టీచర్లను రహస్యంగా వీడియో తీసిన హెడ్మాస్టర్ (Headmaster) ప్రశ్నించినందుకు తిరిగి వారిపైనా రాళ్లతో దాడిచేసిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బరేలి: మహిళా టీచర్లను రహస్యంగా వీడియో తీసిన హెడ్మాస్టర్ (Headmaster) ప్రశ్నించినందుకు తిరిగి వారిపైనే రాళ్లతో దాడిచేసిన ఘటన ఉత్తరప్రదేశ్‌(Uttar pradesh)లోని బరేలీ జిల్లాలో జరిగింది. మహిళా టీచర్లపై రాళ్లతో దాడిచేస్తున్న ప్రధానోపాధ్యాయుడి వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఫరీద్‌పూర్‌లోని సైదాపూర్ ప్రైమరీ పాఠశాల హెడ్మాస్టర్ అయిన ఖుర్షీద్ అలీ.. తమను రహస్యంగా వీడియో తీసినట్టు మహిళా టీచర్లు ఆరోపిస్తున్నారు. హెడ్మాస్టర్ చర్యను నిరసిస్తూ ఉపాధ్యాయినులు ఆందోళనకు దిగారు. 


దీంతో కోపంతో ఊగిపోయిన హెడ్మాస్టర్ అలీ వారిని దుర్భాషలాడుతూ వారిపై రాళ్లు విసిరారు. అంతేకాక, వారి నుంచి సెల్‌ఫోన్లు కూడా లాక్కునే ప్రయత్నం చేశారు. ఈ మొత్తం ఘటన విద్యార్థుల ముందే జరగడం గమనార్హం. ఆ తర్వాత ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినిలు బేసిక్ శిక్ష అధికారికి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ఉన్నతాధికారులు హెడ్మాస్టర్‌ను సస్పెండ్ చేశారు. ఈ సందర్భంగా హెడ్మాస్టర్ ఖుర్షీద్ అలీ మాట్లాడుతూ.. టీచర్లు పిల్లలకు పాఠాలు చెప్పకుండా ల్యాప్‌టాప్‌లలో పనిచేసుకుంటున్నారని, ఉన్నతాధికారులకు సాక్ష్యాలతో సహా ఫిర్యాదు చేసేందుకే వీడియో తీశానని చెబుతున్నారు. 

Updated Date - 2022-07-04T00:16:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising