ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

17 ఏళ్ల బాలిక పరువు హత్య.. తండ్రి, సోదరుడి అరెస్టు

ABN, First Publish Date - 2022-04-23T20:46:21+05:30

ఉత్తరప్రదేశ్‌లోని బాండ జిల్లా గుర్హా కలా గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. 17 ఏళ్ల బాలికను ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాండ: ఉత్తరప్రదేశ్‌లోని బాండ జిల్లా గుర్హా కలా గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. 17 ఏళ్ల బాలికను తండ్రి, సోదరుడు కలిసి గొంతు నులిపి చంపారు. గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. స్థానికుల నుంచి అందిన సమాచారంతో పోలీసులు రంగప్రవేశం చేసి బాలిక మృతదేహాన్ని వెలికి తీశారు. పోస్ట్‌మార్టం కోసం పంపారు. అనంతరం 'పరువు హత్య' కింద కేసు నమోదు చేశారు.


పోస్ట్‌మార్టం నివేదకలో గొంతు నులిమి చంపినట్టు నిర్ధారణ అయిందని పోలీసులు తెలిపారు. ఇంతవరకూ అందిన సమాచారం ప్రకారం, తమ కులానికే చెందిన వ్యక్తితో బాలిక సంబంధాలు నడపడం ఆ కుటుంబానికి ఇష్టం లేదని తెలుస్తోందని డిప్యూటీ ఎస్‌పీ నితిన్ కుమార్ శనివారంనాడు తెలిపారు. బాలికలను హత్య చేసి ఇంటి వెనుకనున్న పశువులపాకలో పాతిపెట్టినట్టు సమాచారం అందడంతో శుక్రవారంనాడు మృతదేహాన్ని వెలికితీశామన్నారు. మృతదేహంపై గాయాలు సైతం ఉన్నాయన్నారు. బాలిక తండ్రి దేశ్‌రాజ్, సోదరుడు ధనంజయ్‌ను అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్టు చెప్పారు.

Updated Date - 2022-04-23T20:46:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising