AAP నేత Somanath Bharatiకి నాన్బెయిలబుల్ వారెంట్
ABN, First Publish Date - 2022-05-21T02:34:15+05:30
ఆమ్ ఆద్మీ పార్టీ నేత సోమ్నాథ్ భారతికి ఉత్తరప్రదేశ్లోని ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు శుక్రవారంనాడు...
సుల్తాన్పూర్: ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నేత సోమ్నాథ్ భారతి (Somnath Bharati) కి ఉత్తరప్రదేశ్లోని ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు శుక్రవారంనాడు నాన్బెయిలబుల్ వారెంట్ (Non bailable Warrant) జారీ చేసింది. అమేథీ జిల్లాలో ఆయనపై నమోదైన ఒక ఎఫ్ఐఆర్కు సంబంధించి ఆ వారెంట్లు జారీ అయ్యాయి. గత ఏడాది జనవరిలో ఉత్తరప్రదేశ్లోని ఆసుపత్రులు, సూళ్లను కించపరచే విధంగా వ్యాఖ్యలు చేసినట్టు ఆయనపై కేసు నమోదైంది. అమేథికి చెందిన సోమ్నాథ్ సహు అనే వ్యక్తి జగదీష్ పూర్ పోలీస్ స్టేషన్లో ఈ మేరకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు ఆ తర్వాత ఎఫ్ఐఆర్లో పరువునష్టం సెక్షన్ను కూడా జోడించి కోర్టుకు సమర్పించారు. దీని ఆధారంగా కోర్టు ఆయనకు వారెంట్లు జారీ చేసింది. కాగా, తదుపరి విచారణను జూన్ 14కు కోర్టు వాయిదా వేసినట్టు సోమ్నాథ్ భారతి తరఫు న్యాయవాది రుద్ర ప్రతాప్ సింగ్ తెలిపారు.
Updated Date - 2022-05-21T02:34:15+05:30 IST