మా బిడ్డను తీసుకురండి
ABN, First Publish Date - 2022-02-26T14:07:04+05:30
ఉక్రెయిన్లో ప్రాణభయంతో గడుపుతున్న తమ కుమారుడిని, అతడి స్నేహితులను స్వస్థలానికి సురక్షితంగా చేర్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణ చర్యలు చేపట్టాలని తిరునల్వేలి జోతిపురానికి చెందిన మెడికల్ విద్యార్థి
చెన్నై: ఉక్రెయిన్లో ప్రాణభయంతో గడుపుతున్న తమ కుమారుడిని, అతడి స్నేహితులను స్వస్థలానికి సురక్షితంగా చేర్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణ చర్యలు చేపట్టాలని తిరునల్వేలి జోతిపురానికి చెందిన మెడికల్ విద్యార్థి మనోజెబదురై తండ్రి శేఖర్సెల్విన్ విజ్ఞప్తి చేశారు. ఉక్రెయిన్. రష్యాల నడుమ యుద్ధం జరుగుతుండటంతో మనోజెబుదురై తల్లిదండ్రులు శేఖర్సెల్విన్, అముదా తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మూడు నెలలక్రితమే తమ కుమారుడికి ఉక్రెయిన్లో మెడికల్ సీటు రావడంతో వెళ్లాడని, గురువారం అతడితో ఫోన్ చేసి మాట్లాడామని, అక్కడి పరిస్థితి భయానకంగా ఉందని, చుట్టూ బాంబు పేలుడు శబ్దాలే వినిపిస్తున్నట్లు తెలిపాడని ఆ దంపతులు కంట తడిపెట్టుకున్నారు.
Updated Date - 2022-02-26T14:07:04+05:30 IST