ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Jammu and Kashmirలో ఎన్‌కౌంటర్...మరో ఇద్దరు ఉగ్రవాదుల హతం

ABN, First Publish Date - 2022-06-20T14:43:23+05:30

జమ్మూకశ్మీర్‌లో సోమవారం ఉదయం మరో ఎన్‌కౌంటర్ జరిగింది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కుప్వారా:  జమ్మూకశ్మీర్‌లో సోమవారం ఉదయం మరో ఎన్‌కౌంటర్ జరిగింది. కుప్వారాలోని లోలాబ్ ప్రాంతంలో సోమవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో భద్రతా బలగాలు మరో ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చాయి.సోమవారం ఉదయం కుప్వారాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో షోకత్ అహ్మద్ షేక్ సహా ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. కుప్వారా ఎన్‌కౌంటర్‌లో ఇప్పటివరకు మొత్తం నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు.కుప్వారాలోని లోలాబ్ ప్రాంతంలో ఉగ్రవాది షోకత్ అహ్మద్ షేక్ గురించి సమాచారం అందుకున్న ఆర్మీ 28ఆర్ఆర్‌తో పాటు కుప్వారా పోలీసులు గాలింపు ప్రారంభించారు. గాలిస్తుండగా ఉగ్రవాదులు కాల్పులు జరపగా, భద్రతా జవాన్లు ఎదురుకాల్పులు జరిపారు. 




ఎన్‌కౌంటర్ అనంతరం సంఘటన స్థలంలో ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.జమ్మూకశ్మీర్‌లో గత 24 గంటల్లో ఏడుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. కుప్వారా ఎన్‌కౌంటర్‌లో నలుగురు లష్కర్ ఉగ్రవాదులు హతమయ్యారు. కుల్గామ్‌ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు జైషే ఉగ్రవాదులు, చత్పోరా పుల్వామా ఎన్‌కౌంటర్‌లో ఒక లష్కర్‌ ఉగ్రవాదులు హతమయ్యారు.2022లో ఇప్పటి వరకు 32 మంది పాకిస్థానీలతో సహా 110 మంది ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి.


Updated Date - 2022-06-20T14:43:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising