ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

jammu kasmerలో ఎన్‌కౌంటర్ ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదుల హతం

ABN, First Publish Date - 2022-06-15T12:52:26+05:30

జమ్మూకశ్మీరులో మంగళవారం రాత్రి జరిగిన ఎన్‌కౌంటర్‌లో నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ)కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు హతం అయ్యారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీనగర్: జమ్మూకశ్మీరులో మంగళవారం రాత్రి జరిగిన ఎన్‌కౌంటర్‌లో నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ)కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు హతం అయ్యారు. షోపియాన్ జిల్లా కంజియులర్ ప్రాంతంలో లష్కరే తోయిబా ఉగ్రవాదులకు, కేంద్ర భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.హతులైన ఉగ్రవాదుల్లో ఒకరు జాన్ అహ్మద్ లోన్‌గా గుర్తించారు.కంజియులర్ ప్రాంతంలో ఉగ్రవాదులున్నారనే విశ్వసనీయ సమాచారం మేర జమ్మూకశ్మీర్ పోలీసులు కేంద్ర భద్రతా బలగాలతో కలిసి గాలింపు చేపట్టాయి. భద్రతా బలగాలు గాలిస్తుండగా ఉగ్రవాదులు కాల్పులు జరపగా, జవాన్లు ఎదురు కాల్పులు జరిపారు. 


సంఘటన స్థలంలో జవాన్లు ఉగ్రవాదుల కోసం బుధవారం కూడా గాలింపు కొనసాగిస్తున్నారు.జాన్ మహ్మద్ జూన్ 2వతేదీన కుల్గాం జిల్లాలో బ్యాంకు మేనేజరు విజయ్ కుమార్ ను హతమార్చిన కేసులో నిందితుడని కశ్మీర్ జోన్ ఐజీపీ బుధవారం ఉదయం చెప్పారు. మరో ఉగ్రవాదిని గుర్తించాల్సి ఉందని పోలీసులు చెప్పారు. 


Updated Date - 2022-06-15T12:52:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising