ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Keralaలో ఇద్దరు పిల్లలకు కొత్తరకం noro virus

ABN, First Publish Date - 2022-06-06T13:46:21+05:30

కేరళ రాష్ట్రంలో కొత్తరకం నోరో వైరస్ అంటువ్యాధి ప్రబలింది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరువనంతపురం : కేరళ రాష్ట్రంలో కొత్తరకం నోరో వైరస్ అంటువ్యాధి ప్రబలింది. తిరువనంతపురం నగరంలో ఇద్దరు పిల్లలకు నోరో వైరస్ సోకిందని కేరళ వైద్యాధికారులు ధృవీకరించారు. నోరోవైరస్ డయేరియా-ప్రేరేపిత రోటవైరస్ మాదిరిగానే ఉంది. ఈ వైరస్ సోకిన పిల్లలకు చికిత్స చేయకపోతే ప్రాణాంతకం కావచ్చని వైద్యులు హెచ్చరించారు.కలుషిత నీరు, ఆహారం ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతుంది కాబట్టి ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నట్లు అధికారులు చెప్పారు. ఈ ప్రాంతంలో నీటి పరిశుభ్రతపై సరైన చర్యలు తీసుకుంటే వ్యాధిని అదుపు చేయవచ్చని అధికారులు చెప్పారు.నోరో వైరస్ సోకిన పిల్లల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ప్రజలంతా ఈ వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని కేరళ ఆరోగ్యశాఖ మంత్రి జార్జ్ చెప్పారు.


ఫుడ్ పాయిజనింగ్ అని ఫిర్యాదు చేసిన తర్వాత పిల్లల్లో నోరోవైరస్ ఇన్ఫెక్షన్ కనుగొన్నారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత పిల్లలకు ఈ లక్షణాలు కనిపించాయని అధికారులు అనుమానిస్తున్నారు.నోరోవైరస్ సోకిన రోగులు వాంతులు,విరేచనాలు, తలనొప్పి, శరీర నొప్పులతో బాధపడుతుంటారు. కలుషితమైన ఆహారం, నీరు వల్ల ఈ వైరస్ వ్యాపిస్తుంది.లావెటరీని ఉపయోగించిన తర్వాత సబ్బుతో పదేపదే చేతులు కడుక్కోవడం వంటి జాగ్రత్తలు పాటించాలని వైద్యులు ప్రజలను కోరారు.

Updated Date - 2022-06-06T13:46:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising