ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అత్యంత పొడవైన టీ-49 సొరంగం తవ్వకం పూర్తి

ABN, First Publish Date - 2022-02-17T07:34:55+05:30

జమ్మూకశ్మీర్‌లోని 12.758 కిలోమీటర్ల దూరం కలిగిన టీ-49 సొరంగంలో బ్రేక్‌త్రూను సాధించామని భారత రైల్వే తాజాగా ప్రకటించింది.....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీనగర్‌, ఫిబ్రవరి 16: జమ్మూకశ్మీర్‌లోని 12.758 కిలోమీటర్ల దూరం కలిగిన టీ-49 సొరంగంలో బ్రేక్‌త్రూను సాధించామని భారత రైల్వే తాజాగా ప్రకటించింది. ఇరువైపులా మొదలైన తవ్వకం పనులు, ఒకదానికొకటి కలిసి, తవ్వకం ముగిస్తే బ్రేక్‌ త్రూగా చెబుతారు. ఇది సాధించడంతో.. ఇక రైల్వే ట్రాక్‌ సంబంధిత పనులనూ వేగంగా పూర్తి చేయనున్నట్లు అధికారులు తెలిపారు. దేశంలో అత్యంత పొడవైన రైల్వే సొరంగం రికార్డు ఇప్పటి వరకూ పీర్‌ పంజల్‌ (11.2 కిలోమీటర్లు) పేరిట ఉండగా.. పూర్తైన అనంతరం టీ-49 అతి పెద్ద రైల్వే సొరంగంగా చరిత్ర సృష్టించనుంది. సుమారు 1400 మీటర్ల ఎత్తులో ఉన్న ఇది సుంబెర్‌, అర్పించల స్టేషన్లను కలుపుతుంది. ఇక.. టీ-49 సొరంగంలో ఒకటి ప్రధానమైనది కాగా.. దాని పక్కనే మరో సొరంగాన్ని(ఎస్కేప్‌ టనెల్‌) కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఎప్పుడైనా సొరంగంలో ఊహించని ఘటన జరిగితే.. వెంటనే సహాయం అందించేందుకు ఈ రెండో సొరంగాన్ని వాడతారు.

Updated Date - 2022-02-17T07:34:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising