నేడు నగరానికి అమిత్షా
ABN, First Publish Date - 2022-04-23T14:38:35+05:30
పుదుచ్చేరి పర్యటన కోసం వస్తున్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా శనివారం రాత్రి చెన్నైలో బస చేయనున్నారు. ఇందుకోసం ఆయన ప్రత్యేక విమానంలో చెన్నై రానున్నారు.
పెరంబూర్(చెన్నై): పుదుచ్చేరి పర్యటన కోసం వస్తున్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా శనివారం రాత్రి చెన్నైలో బస చేయనున్నారు. ఇందుకోసం ఆయన ప్రత్యేక విమానంలో చెన్నై రానున్నారు. విమానాశ్రయం నుంచి కారులో ఆవడిలోని కేంద్ర రిజర్వ్ పోలీసుదళం ప్రాంగణంలోని విడిది గృహంలో రాత్రికి బస చేయనున్నారు. విమానాశ్రయం నుంచి ఆవడి వరకు ఆయనకు ఘనస్వాగతం పలికేందుకు బీజేపీ కార్యకర్తలు సమాయత్తమవుతున్నారు. విడిది గృహంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై సహా పలువురు నేతలు అమిత్షాతో సమావేశం కానున్నారు. ఆదివారం చెన్నై విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో కేంద్రమంత్రి పుదుచ్చేరి వెళ్లనున్నారు. పుదుచ్చేరి విశ్వవిద్యాలయంలో జరిగే అరవిందుడి 150వ జయంతి, కదిర్గామంలోని ఇందిరాగాంధీ వైద్యకళాశాల స్నాతకోత్సవంలో పాల్గొననున్న కేంద్రమంత్రి, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు.
Updated Date - 2022-04-23T14:38:35+05:30 IST