మూడు నెలల తరువాత రాష్ట్రంలో తొలి Covid మరణం
ABN, First Publish Date - 2022-06-16T13:01:00+05:30
రాష్ట్రంలో మూడు నెలల తరువాత మళ్లీ కరోనా మరణం నమోదైంది. రాష్ట్రంలో కొవిడ్ వ్యాప్తి మొదలైనప్పటి నుంచి మార్చి 9వ తేదీ వరకు 38,025 మంది
చెన్నై, జూన్ 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మూడు నెలల తరువాత మళ్లీ కరోనా మరణం నమోదైంది. రాష్ట్రంలో కొవిడ్ వ్యాప్తి మొదలైనప్పటి నుంచి మార్చి 9వ తేదీ వరకు 38,025 మంది మరణించారు. ఆ తరువాత కేసులు గణనీయంగా తగ్గుముఖం పట్టడంతో పాటు మరణాలు పూర్తిగా ఆగిపోయాయి. కానీ ఇటీవల కాలంలో రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్ కేసులు పెరగడం ప్రారంభమైంది. 50కి లోపున్న కేసులు.. వారం రోజుల్లోనే 476కి చేరాయి. అంతేగాక బుధవారం కరోనా మరణం నమోదైంది. తంజావూరు ప్రభుత్వ వైద్య కళాశాలలో ఓ మహిళ కరోనాతో మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. రాష్ట్రంలో మూడు నెలల తరువాత ఇదే తొలి కరోనా మరణం. దీంతో కరోనా వల్ల ఇప్పటి వరకూ మరణించిన వారి సంఖ్య 38,026కి చేరింది. దీంతో అన్నివర్గాల్లోనూ ఆందోళన మొదలైంది.
Updated Date - 2022-06-16T13:01:00+05:30 IST