హిమాచల్ ప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం...ముగ్గురి మృతి
ABN, First Publish Date - 2022-02-08T12:57:38+05:30
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందగా,మరో ఇద్దరు గాయపడ్డారు....
సిమ్లా :హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందగా,మరో ఇద్దరు గాయపడ్డారు.మొదటి ప్రమాదం నిచార్ తహసీల్లోని కథ్గావ్లో ఆదివారం రాత్రి జరిగింది. రెండవ రోడ్డు ప్రమాదంలో కార్చామ్ డ్యామ్ సమీపంలో కారు బండరాయిని ఢీకొనడంతో ఒక మహిళతో సహా ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు.నిచార్ తహసీల్లోని కథ్గావ్లో ఆదివారం రాత్రి జరిగిన మొదటి ప్రమాదంలో వారు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి లోతైన లోయలోకి పడిపోవడంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు క్రాబా గ్రామానికి చెందిన 38 ఏళ్ల బాబు రామ్, సునీల్ (24), కుందన్ (38)లని పోలీసులు చెప్పారు.
మృతులు నేపాల్కు చెందిన వారని కిన్నౌర్ పోలీసులు తెలిపారు.మృతుల బంధువులకు ఒక్కొక్కరికి 20వేల రూపాయల చొప్పున అధికారులు తక్షణ సాయం అందించారు.రెండవ ప్రమాదంలో కార్చామ్ డ్యామ్ సమీపంలో వారు ప్రయాణిస్తున్న కారును బండరాయి ఢీకొనడంతో ఒక మహిళతో సహా ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు.క్షతగాత్రులను షోల్టులోని ఆసుపత్రిలో చేర్చారు.
Updated Date - 2022-02-08T12:57:38+05:30 IST