Nepal: కొండచరియలు విరిగిపడి 13 మంది మృతి, 10 మంది గల్లంతు
ABN, First Publish Date - 2022-09-17T18:27:36+05:30
నేపాల్ దేశంలో కురుస్తున్న భారీవర్షాలతో కొండచరియలు విరిగిపడి(landslide hits) 13 మంది దుర్మరణం...
ఖట్మండు(నేపాల్): నేపాల్ దేశంలో కురుస్తున్న భారీవర్షాలతో కొండచరియలు విరిగిపడి(landslide hits) 13 మంది దుర్మరణం చెందారు. నేపాల్ దేశంలోని అచ్ఛం జిల్లాలో కొండచరియలు విరిగి పడిన దుర్ఘటనలో 13మంది మరణించగా, మరో 10 మంది గల్లంతు(missing) అయ్యారు. కొండచరియల కింద చిక్కుకున్న మరో 10 మందిని సహాయ సిబ్బంది రక్షించారని నేపాల్ డిప్యూటీ చీఫ్ జిల్లా ఆఫీసరు దీపేష్ రిజాల్ చెప్పారు. భారీవర్షాలు, వరదల వల్ల కొండచరియలు విరిగిపడిన ప్రాంతాల్లో సహాయ పునరావాస కార్యక్రమాల కోసం నేపాల్ హోం మంత్రిత్వశాఖ హెలికాప్టర్లను(helicopters) రంగంలోకి దించింది. గల్లంతైన వారి కోసం హెలికాప్టర్లతో గాలిస్తున్నారు.(search operation)
Updated Date - 2022-09-17T18:27:36+05:30 IST