ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Toll Fee: తరచూ హైవేపై ప్రయాణిస్తుంటారా.. టోల్ ఫీజులపై పండగ చేసుకునే వార్త..

ABN, First Publish Date - 2022-08-09T00:20:20+05:30

దేశంలో ప్రస్తుతం అమలవుతున్న టోల్ విధానంలో పెను మార్పులు తీసుకొచ్చే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులేస్తోంది. టోల్ ప్లాజాలను పూర్తిగా తొలగించే విధంగా శరవేగంగా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశంలో ప్రస్తుతం అమలవుతున్న టోల్ విధానంలో పెను మార్పులు తీసుకొచ్చే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులేస్తోంది. టోల్ ప్లాజాలను పూర్తిగా తొలగించే విధంగా శరవేగంగా ముందుకెళుతోంది. అందులో భాంగానే జీపీఎస్ ఆధారిత టోల్ కలెక్షన్ (GPS-Based Toll Collection) విధానాన్ని త్వరలో అమల్లోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ విషయాన్ని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గత బుధవారం (ఆగస్ట్ 3) స్వయంగా వెల్లడించారు. అసలు ఈ GPS-Based Toll Collection విధానం ఏంటి.. ఈ విధానం అమలులోకి వస్తే టోల్ ఫీజు చెల్లించేవారికి ఏమేరకు ప్రయోజనం చేకూరుతుందనే అంశాలపై నెటిజన్ల మధ్య చర్చ జరుగుతోంది. హైవేలపై ప్రయాణించే వాహనదారుల నుంచి టోల్ వసూలు చేసేందుకు ప్రస్తుతం ఉన్న టోల్ ప్లాజాలకు మంగళం పాడి ఆ స్థానంలో జీపీఎస్ ఆధారిత టోల్ కలెక్షన్ విధానాన్ని అమలు చేయాలని కేంద్రం గతేడాదే నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని అమలు చేసేందుకు వడివడిగా అడుగులేస్తోంది.



ఈ విధానం అమల్లోకి వస్తే FASTag కూడా కనుమరుగు కానుంది. ఈ జీపీఎస్ ఆధారిత టోల్ కలెక్షన్ విధానంలో.. టోల్ ఎలా వసూలు చేస్తారంటే.. ఉదాహరణకు హైవేపై ఒక కారు ప్రయాణం చేస్తుంటే.. ఆ హైవేపై ఆ కారు ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేసిందో అన్ని కిలోమీటర్లకు టోల్‌ను వసూలు చేస్తారు. అంటే.. కారు ఎక్కువ కిలోమీటర్లు ప్రయాణిస్తే ఎక్కువ టోల్ ఫీజు, తక్కువ కిలోమీటర్లు ప్రయాణిస్తే తక్కువ టోల్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నమాట. కొన్ని సందర్భాల్లో హైవేపై ప్రయాణించే దూరం తక్కువే అయినప్పటికీ ఎక్కువ టోల్ ఫీజు కట్టాల్సి వస్తుంది. అలాంటి వారికి ఈ జీపీఎస్ ఆధారిత టోల్ కలెక్షన్ విధానం మేలు చేస్తుంది. ఈ విధానం ద్వారా కారు హైవేపై/ఎక్స్‌ప్రెస్‌వేపైకి రాగానే ఇన్‌స్టాల్ చేసిన జీపీఎస్ ట్రాకర్ ప్రయాణించే కిలోమీటర్లను లెక్కగట్టడం మొదలుపెడుతుంది.



కారు ఆ హైవేపై నుంచి దిగిపోగానే ఆటోమేటిక్‌గా అప్పటివరకూ ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించిందో అన్ని కిలోమీటర్లకు టోల్ అమౌంట్ ఎగ్జిట్ పాయింట్ వద్ద Deduct అవుతుంది. ఈ విధానంలో భాగంగా వాహన యజమానులు చేయాల్సింది ఏంటంటే.. వారి వాహనాలకు జీపీఎస్‌ ట్రాకర్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు.. వాహనదారుడి పేరు, అడ్రస్, వెహికల్ మోడల్, రిజిస్ట్రేషన్ నంబర్, బ్యాంకు వివరాలను రిజిస్ట్రర్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే.. ఈ విషయంలో స్పష్టత రానిది ఏంటంటే.. టోల్ అమౌంట్ అనేది నేరుగా బ్యాంక్ అకౌంట్ నుంచి Deduct అవుతుందో లేదా ఏదైనా ప్రత్యేక ఆన్‌లైన్ వ్యాలెట్‌లో యాడ్ చేసుకున్నాక ఆ ఛార్జీలు Deduct అవుతాయో తెలియలేదు. ఈ జీపీఎస్ ఆధారిత టోల్ కలెక్షన్ విధానం యూరోపియన్ దేశాల్లో అమలులో ఉంది.

Updated Date - 2022-08-09T00:20:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising