తమిళనాట మళ్లీ లాక్డౌన్
ABN, First Publish Date - 2022-01-06T08:12:42+05:30
కరోనా, ఒమైక్రాన్ కేసులు పెరుగుతుండడంతో తమిళనాడు ప్రభుత్వం ‘కఠిన’ నిర్ణయం తీసుకుంది. గురువారం నుంచి లాక్డౌన్ నిబంధనలు అమలు చేయాలని సీఎం స్టాలిన్ ఉత్తర్వులు జారీచేశారు.
ప్రతి రోజూ రాత్రి పూట కర్ఫ్యూ
చెన్నై, జనవరి 5(ఆంధ్రజ్యోతి): కరోనా, ఒమైక్రాన్ కేసులు పెరుగుతుండడంతో తమిళనాడు ప్రభుత్వం ‘కఠిన’ నిర్ణయం తీసుకుంది. గురువారం నుంచి లాక్డౌన్ నిబంధనలు అమలు చేయాలని సీఎం స్టాలిన్ ఉత్తర్వులు జారీచేశారు. రాత్రి 10నుంచి ఉదయం 5గంటల వరకు కర్ఫ్యూ అమలు చేయనున్నారు. ఇక ఆదివారాల్లో సంపూర్ణ లాక్డౌన్ అమలులోకి రానుంది. ఆదివారాల్లో నిత్యావసర సేవలు మినహా సంపూర్ణ లాక్డౌన్ విధించాలని నిర్ణయించారు.
Updated Date - 2022-01-06T08:12:42+05:30 IST