ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Yasin Malik: జైలులో ఆరోరోజు నిరాహార దీక్షతో ఆసుపత్రికి తరలింపు

ABN, First Publish Date - 2022-07-27T20:18:03+05:30

తీహార్ జైలులో గత శుక్రవారం నుంచి నిరాహార దీక్ష చేస్తున్న కశ్మీర్ వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్‌ను ఢిల్లీలోని ఆర్ఎంఎల్ ఆసుపత్రికి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: తీహార్ జైలులో గత శుక్రవారం నుంచి నిరాహార దీక్ష చేస్తున్న కశ్మీర్ వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్ (Yasin Malik)ను ఢిల్లీలోని ఆర్ఎంఎల్ ఆసుపత్రికి తరలించారు. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసులో దోషిగా ఆయనకు యావజ్జీవ శిక్ష పడింది. నిరాహార దీక్ష కారణంగా బ్లడ్ ప్రెషర్‌లో హెచ్చతగ్గులు కనిపించడంతో ఆయనను మంగళవారంనాడు ఆసుపత్రికి షిఫ్ట్ చేసినట్టు అధికారులు చెప్పారు. తనకు వైద్యం అవసరం లేదని మెడికల్ ఫెసిలిటీ అధికారులకు ఆయన లేఖ సమర్పించినట్టు తెలిపారు.


రుబియా సయీద్ అపహరణ కేసులో నిందితుడైన యాసిన్ మాలిక్ జమ్మూకశ్మీర్‌లో జరుగుతున్న ఈ కేసు విచారణకు వ్యక్తిగతంగా హాజరుకావాలని కోరుకుంటున్నారు. తనపై వచ్చిన ఆరోపణలకు స్వయంగా తానే వివరణ ఇవ్వాలనుకుంటున్నానని, సాక్షులను తానే క్రాస్ ఎగ్జామిన్ చేస్తానని, ఇందుకోసం జమ్మూ జైలుకు తనను బదిలీ చేయాలని ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు. దీనికి కేంద్రం స్పందించకపోవడంతో ఆయన గత ఆరురోజులుగా నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు.

Updated Date - 2022-07-27T20:18:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising