జమ్మూలో ఆలయం ధ్వంసం
ABN, First Publish Date - 2022-04-10T00:26:38+05:30
జమ్మూలోని ఓ హిందూ ఆలయాన్ని కొందరు గుర్తుతెలియని దుండగలు ధ్వంసం..
శ్రీనగర్: జమ్మూలోని ఓ హిందూ ఆలయాన్ని కొందరు గుర్తుతెలియని దుండగలు ధ్వంసం చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి, దుండగుల కోసం గాలిస్తున్నట్టు అధికారులు శనివారంనాడు తెలిపారు. సిటీ శివార్లలోని సిధ్రలో ఈ ఘటన చోటుచేసుకుంది. దశాబ్దాల క్రితం నాటి ఈ ఆలయంలోని విగ్రహాలను దుండగలు ధ్వంసం చేసినట్టు అధికారులు చెప్పారు.
ఆలయ పూజారాలు ఉదయం ఆలయానికి చేరుకోగానే విగ్రహాల విధ్వంసం జరిగినట్టు గుర్తించారని, వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారని, శుక్రవారం రాత్రి, శనివారం తెల్లవారుజాము మధ్యలో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోందని అధికారులు చెప్పారు. కాగా, దుండగులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టినట్టు పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ప్రజలు మతసామరస్యాన్ని పాటించాలని, శాంతికి భంగం కలిగించేందుకు ప్రయత్నించే విద్రోహ శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు.
Updated Date - 2022-04-10T00:26:38+05:30 IST