ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Presidential Election 2022: తేజస్వీ సంచలన వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2022-07-18T21:48:06+05:30

పాట్నా: ఆర్జేడీ అధినేత తేజస్వీ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర మంత్రి పదవి చేపట్టక ముందు నిత్యానంద్ రాయ్ తనను కలిశారని, తనను ఆర్జేడీలోకి తీసుకోవాలని కోరారని గుర్తు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాట్నా: రాష్ట్రపతి ఎన్నికల వేళ ఆర్జేడీ అధినేత tejashwi yadav సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర మంత్రి పదవి చేపట్టక ముందు nityanand rai తనను కలిశారని, తనను ఆర్జేడీలోకి తీసుకోవాలని కోరారని గుర్తు చేశారు. తనకు బీజేపీలో చేరాలని లేదని కూడా నిత్యానంద్ రాయ్ చెప్పారని తేజస్వీ వెల్లడించారు. నిత్యానంద్ రాయ్ ప్రస్తుతం కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో భాగంగా ఓటేసేందుకు బీహార్ అసెంబ్లీకి వచ్చిన సందర్భంగా తేజస్వీ ఈ వ్యాఖ్యలు చేశారు. తాము ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్ధి Draupadi Murmuను ఎన్నుకోబోమని స్పష్టం చేశారు. బీజేపీకి ఆదివాసీలపై ప్రేమ ఉంటే రిజర్వేషన్లు పెంచుకోవాలని, అంతేకానీ ముర్ముకు మద్దతివ్వమంటే కుదరదని తేల్చి చెప్పారు. ముర్మును ఆయన విగ్రహంతో పోల్చి మాట్లాడారు. ముర్ము ఇప్పటివరకూ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించకపోవడాన్ని తేజస్వీ తప్పుబట్టారు. విపక్షాల అభ్యర్ధి యశ్వంత్ సిన్హా విలేకరుల సమావేశం పెట్టి తన మనసులో మాటను బయటపెట్టారని తేజస్వీ గుర్తు చేశారు. 



Updated Date - 2022-07-18T21:48:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising