రాజ్యసభ వేదికగా టీడీపీ Vs వైసీపీ
ABN, First Publish Date - 2022-02-07T17:07:10+05:30
రాజ్యసభ వేదికగా టీడీపీ, వైసీపీ తలపడ్డాయి. ఇరు పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం జరిగింది. సీఎం జగన్ ప్రభుత్వ వైఫల్యాలను టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ ఎండగట్టారు.
ఢిల్లీ : రాజ్యసభ వేదికగా టీడీపీ, వైసీపీ తలపడ్డాయి. ఇరు పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం జరిగింది. సీఎం జగన్ ప్రభుత్వ వైఫల్యాలను టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ ఎండగట్టారు. గుడివాడలో కేసినోపై ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ వైసీపీ నేతలను ఇరుకున పెట్టారు. అలాగే జనసేన అధినేత పవన్ కల్యాణ్ సినిమాలకు జగన్ చెక్ పెట్టారని కనకమేడల వ్యాఖ్యానించారు. ఏపీలో ఆర్ధిక అరాచకం నెలకొన్నదన్నారు. కేంద్రం జోక్యం చేసుకోకపోతే చేయిదాటి పోతుందన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై కనకమేడల ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే కనకమేడల ప్రసంగానికి అడుగడుగునా వైసీపీ ఎంపీలు అడ్డుపడుతూనే ఉన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు పాలనకన్నా జగన్ పాలన వెయ్యి రెట్లు మెరుగ్గా ఉందని వైసీపి ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.
Updated Date - 2022-02-07T17:07:10+05:30 IST