ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐఐటీ మద్రాస్‌లో మరో 18 మందికి కొవిడ్

ABN, First Publish Date - 2022-04-22T20:07:26+05:30

చెన్నై : కొవిడ్ కేసులు తగ్గుతున్నాయని అంతా ఊపిరిపీల్చుకుంటున్న తరుణంలో మరోసారి పెరుగుతున్న కేసులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై : కొవిడ్ కేసులు తగ్గుతున్నాయని అంతా ఊపిరిపీల్చుకుంటున్న తరుణంలో మరోసారి పెరుగుతున్న కేసులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఐఐటీ మద్రాస్ విద్యార్థుల్లో  మరో 18 మందికి కొవిడ్ నిర్ధారణ అయ్యింది. దీంతో గత 4 రోజుల్లో ఇక్కడ నమోదయిన కేసుల సంఖ్య 30 దాటింది. దీంతో క్యాంపస్‌లోని విద్యార్థులు, స్టాఫ్ అందరికీ జీసీసీ(ది గ్రేటర్ చెన్నై కార్పొరేషన్) కొవిడ్ పరీక్షలు నిర్వహిస్తోంది. కొవిడ్ నిర్ధారణ అయిన విద్యార్థుల ఆరోగ్యం నిలకడగానే ఉందని అధికారులు వెల్లడించారు. కొంతమందికి గొంతు నొప్పి, ఒక విద్యార్థి జ్వరంతో బాధపడుతున్నారని వివరించారు. వీరంతా ఐసోలేషన్‌లో ఉన్నారు. దీంతో కాలేజ్‌లో జరిగే అన్నీ సాంస్కృతిక, అకడమిక్ ఈవెంట్లను వాయిదా వేస్తున్నట్టు ఐఐటీ మద్రాస్ అధికారులు వెల్లడించారు. రద్దీని నియంత్రించేందుకు ఈ చర్యలు తీసుకున్నట్టు తెలిపారు.


తమిళనాడులో మాస్క్ తప్పనిసరి

తమిళనాడులో మాస్క్ తప్పనిసరి నిబంధనను తిరిగి అమల్లోకి తీసుకొస్తూ అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తిరిగి ఈ నిబంధనను ఆచరణలో ప్రవేశపెట్టింది. ఈ నిబంధనను ఉల్లంఘించినవారు రూ.500 జరిమానా చెల్లించాల్సి ఉంటుందని తమిళనాడు హెల్త్ సెక్రటరీ జే రాధాక్రిష్ణన్ శుక్రవారం ప్రకటించారు. కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినప్పుడు తప్పనిసరి మాస్క్ నిబంధనను విరమించుకున్నామని, మళ్లీ కేసులు పెరగుతున్న నేపథ్యంలో నిబంధనను పున:ప్రవేశపెట్టామని చెప్పారు.

Updated Date - 2022-04-22T20:07:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising