ఐఐటీ మద్రాస్లో 171 మంది విద్యార్థులకు కోవిడ్ పాజిటివ్
ABN, First Publish Date - 2022-04-28T22:41:16+05:30
ఐఐటీ మద్రాస్లో 171 మంది విద్యార్థులకు కోవిడ్ పాజిటివ్
తమిళనాడు: ఐఐటీ మద్రాస్లో 10 రోజుల్లో 171 మంది విద్యార్థులకు కోవిడ్ పాజిటివ్గా తేలిందని వైద్య అధికారులు తెలిపారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-మద్రాస్లో గురువారం మరో 26 మందికి కోవిడ్-19 పాజిటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఏప్రిల్ 19న భాంద్రా హాస్టల్లో కరోనా ఇన్ఫెక్షన్ గుర్తించినప్పటి నుంచి కరోనా వైరస్ బారిన పడిన మొత్తం వ్యక్తుల సంఖ్య 171కి చేరుకుందని వైద్య అధికారులు పేర్కొన్నారు. ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం 7,490 మంది విద్యార్థులు క్యాంపస్లో ఉన్నారని తెలుస్తోంది.
Updated Date - 2022-04-28T22:41:16+05:30 IST