ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జహంగీర్‌పురిలో ఆక్రమణల తొలగింపుపై సుప్రీంకోర్టు స్టే

ABN, First Publish Date - 2022-04-20T16:52:49+05:30

దేశ రాజధాని నగరం ఢిల్లీలోని జహంగీర్‌పురిలో ఆక్రమణల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరం ఢిల్లీలోని జహంగీర్‌పురిలో ఆక్రమణల తొలగింపు కోసం ఉత్తర  ఢిల్లీ నగర పాలక సంస్థ చేపట్టిన చర్యలను సుప్రీంకోర్టు బుధవారం నిలిపేసింది. ఈ అంశంపై తదుపరి విచారణ గురువారం జరుగుతుందని తెలిపింది. ఇదే అంశంపై విచారణ జరిపేందుకు ఢిల్లీ హైకోర్టు అంగీకరించింది. బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు దీనిపై విచారణ జరపనున్నట్లు చెప్పింది. 


హనుమాన్ జయంతి శోభాయాత్ర సందర్భంగా శనివారం ఈ ప్రాంతంలో ఘర్షణలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ కేసుపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు మైనర్లు, 25 మంది వయోజనులను ఈ కేసులో అరెస్టు చేశారు. 


ఉత్తర ఢిల్లీ నగర పాలక సంస్థ అధికారులు బుధవారం ఈ ప్రాంతంలోని అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు ప్రయత్నించింది. కట్టుదిట్టమైన భద్రత నడుమ కొన్ని ఆక్రమణలను తొలగించింది. ఈ నేపథ్యంలో ఈ చర్యలను నిలిపేయాలని కోరుతూ ఓ పిటిషన్ సుప్రీంకోర్టులో దాఖలైంది. సీనియర్ అడ్వకేట్ దుష్యంత్ దవే వాదనలు వినిపిస్తూ, జహంగీర్ పురి ఏరియాలో అనధికారికంగా, రాజ్యాంగ విరుద్ధంగా ఆక్రమణలను తొలగిస్తున్నారని ఆరోపించారు. 


Updated Date - 2022-04-20T16:52:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising