BJP MLA harassment ..నలుగురు ఆత్మహత్యాయత్నం
ABN, First Publish Date - 2022-06-15T17:24:28+05:30
కర్ణాటక రాష్ట్రంలో ఓ బీజేపీ ఎమ్మెల్యే వేధింపుల కారణంగా నలుగురు కుటుంబ సభ్యులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు....
బెంగళూరు: కర్ణాటక రాష్ట్రంలో ఓ బీజేపీ ఎమ్మెల్యే వేధింపుల కారణంగా నలుగురు కుటుంబ సభ్యులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. హవేరీ జిల్లాలో బీజేపీ ఎమ్మెల్యే నెహ్రూ ఓలేకర్, ఆయన కుమారులు తమను వేధించారని ఆరోపిస్తూ ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.పాండప్ప లమాని (70), గురుచప్ప లమాని (72), గంగవ్వ కబ్బూరు (65), హనునాథప్ప (41) తమకున్న సాగు భూమిలో విషం తాగి ఆత్మహత్యకు యత్నించారు. వారందరినీ చికిత్స నిమిత్తం దావణగెరె ఆసుపత్రికి తరలించారు.భూవివాదానికి సంబంధించి బీజేపీ ఎమ్మెల్యే నెహ్రూ ఓలేకర్, ఆయన కుటుంబం తమను వేధించినట్లు బాధితులు ఆరోపించారు.
బీజేపీ ఎమ్మెల్యే,అతని కుటుంబం బాధితులకు ఐదు గుంటల భూమిని తక్కువ ధరకు ఇవ్వాలని డిమాండ్ చేసింది. ప్రభుత్వం ఆ భూమిని ప్రభుత్వ పథకం కింద రైతులకు కేటాయించింది.ప్రభుత్వ పథకం ద్వారా గ్రామంలో మొత్తం 29 మంది లబ్ధి పొందారు. ఒక్కొక్కరికి ఎకరం 15 గుంటల భూమి లభించింది. ప్రతి ఒక్కరూ తనకు కొంత భూమిని తిరిగి ఇవ్వాలని ఎమ్మెల్యే కోరారు.దీనిపై ప్రజలు నిరసన వ్యక్తం చేసి భూమిని తిరిగి ఇవ్వడానికి నిరాకరించారు.ఈ భూమిలో సర్వే చేసేందుకు కూడా ఎమ్మెల్యే అధికారులను అనుమతించడం లేదని ప్రజలు ఆరోపించారు.
Updated Date - 2022-06-15T17:24:28+05:30 IST