ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బెంబేలెత్తించిన స్పైస్ జెట్ విమానం..15 మందికి గాయాలు

ABN, First Publish Date - 2022-05-02T18:19:00+05:30

ముంబై నుంచి దుర్గాపూర్‌కు వెళ్తున్న స్పైస్ జెట్ ఎస్‌జీ-945 విమానం ఆదివారంనాడు ప్రయాణికులను..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: ముంబై నుంచి దుర్గాపూర్‌కు వెళ్తున్న స్పైస్ జెట్ ఎస్‌జీ-945 విమానం ఆదివారంనాడు ప్రయాణికులను బెంబేలెత్తించింది. ల్యాండింగ్ సమయంలో విమానం తీవ్రమైన కుదుపులకు లోనైంది. దీంతో సుమారు 15 మంది వరకూ ప్రయాణికులు గాయపడ్డారు. తీవ్రమైన కుదుపులతో ప్రయాణికుల వస్తువులు చెల్లాచెదురయ్యాయి.అక్కడి పరిస్థితిని ప్రయాణికులు కొందరు ఫోన్లతో వీడియో తీయగా, అధికారులు ప్రయాణికులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఎట్టకేలకు విమానం సురక్షితంగా దుర్గాపూర్‌ విమానాశ్రయంలో ల్యాండ్ కావడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. గాయపడిన వారిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. ఇందుకు సబంధించిన 42 సెకెండ్ల వీడియా ఇప్పుడు సామాజిక మాద్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై స్పైస్ జెట్ విచారం వ్యక్తం చేసింది. గాయపడిన వారికి వైద్య సాయం అందిస్తున్నట్టు తెలిపింది.

Updated Date - 2022-05-02T18:19:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising