Soldiers march: కుమరి నుంచి తిరువనంతపురం వరకు సైనికుల పాదయాత్ర
ABN, First Publish Date - 2022-08-12T16:20:34+05:30
కన్నియాకుమారి(Kanniyakumari) నుంచి తిరువనంతపురం వరకు సైనికులు పాదయాత్ర చేపట్టారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా పలు
ఐసిఎఫ్(చెన్నై), ఆగస్టు 11: కన్నియాకుమారి(Kanniyakumari) నుంచి తిరువనంతపురం వరకు సైనికులు పాదయాత్ర చేపట్టారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా కన్నియాకుమారి త్రివేణి సంగం నుంచి గురువారం ‘తిరంగా యాత్ర’(Tiranga Yatra) ప్రారంభమైంది. దేశ 75వ స్వాతంత్ర్యానికి గుర్తుగా 75 మంది సైనికులు జాతీయ జెండాలతో కన్నియాకుమారి నుంచి బయల్దేరి నాగర్కోయిల్ మీదుగా ఈ నెల 14న తిరువనంతపురం చేరుకోనున్నారు.
Updated Date - 2022-08-12T16:20:34+05:30 IST