ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bharat jodo: రాహుల్ యాత్రలో గౌరి లంకేష్ కుటుంబ సభ్యులు

ABN, First Publish Date - 2022-10-08T01:41:06+05:30

కాంగ్రెస్ భారత్ జోడో యాత్రలో దివంగత జర్నలిస్టు, హక్కుల కార్యకర్త గౌరీ లంకేష్ కుటుంబ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర (Bharat jodo yatra) లో దివంగత జర్నలిస్టు, హక్కుల కార్యకర్త గౌరీ లంకేష్ (Gauri lankesh) కుటుంబ సభ్యులు శుక్రవారంనాడు పాల్గొన్నారు.  రాహుల్ పాదయాత్రలో గౌరీ లంకేష్ తల్లి ఇందిరా లంకేష్, సోదరి కవితా లంకేష్ పాల్గొని తమ సంఘీభావం తెలిపారు. లంకేష్ వంటి ఎందరో ప్రజల వాణిని జోడో యాత్ర ప్రతిబింబిస్తోందని, ప్రజావాణిని ఎవరూ అణిచివేయలేరని రాహుల్ ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు.


''సత్యం, ధైర్యం, స్వేచ్ఛ కోసం గౌరి లంకేష్ నిలిచారు. భారతదేశ స్ఫూర్తికి ప్రతీకలుగా నిలిచిన లంకేష్‌కు, ఆమె వంటి ఇతరులకు నేను బాసటగా నిలబడతాను. వారి వాణి భారత్ జోడోలో ప్రతిబింబిస్తోంది. ఆ వాణిని ఎవరూ అణిచివేయలేను'' అని రాహుల్ ట్వీట్ చేశారు. 2017 సెప్టెంబర్ 5న దక్షిణ బెంగళూరులోని తన నివాసం వెలుపల  గౌరీ లంకేష్ హత్యకు గురయ్యారు. ఆమె హత్యపై దేశవ్యక్తంగా పలు నగరాల్లో నిరసనలు వెల్లువెత్తాయి. అప్పటికి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ హత్య కేసుపై దర్యాప్తునకు 'సిట్'ను ఏర్పాటు చేసింది.

Updated Date - 2022-10-08T01:41:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising