ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మార్మగోవా సముద్రంలోనే Mumbai-Goa cruise ship

ABN, First Publish Date - 2022-01-04T13:14:27+05:30

ముంబై-గోవా కోర్డెలియా క్రూయిజ్ షిప్ లో 66 మంది ప్రయాణికులకు కొవిడ్ పాజిటివ్ అని రావడంతో విహార నౌకను మార్మగోవా పోర్టు ట్రస్టులోకి అనుమతించలేదు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరోనా రోగులు దిగేందుకు అనుమతి నిరాకరణ

పనాజీ (గోవా): ముంబై-గోవా కోర్డెలియా క్రూయిజ్ షిప్ లో 66 మంది ప్రయాణికులకు కొవిడ్ పాజిటివ్ అని రావడంతో విహార నౌకను మార్మగోవా పోర్టు ట్రస్టులోకి అనుమతించలేదు. విహార నౌకలో కొవిడ్ సోకిన ప్రయాణికులను షిప్ నుంచి కింద దిగడానికి అనుమతించబోమని గోవా ఆరోగ్య మంత్రి విశ్వజిత్ రాణే తెలిపారు.క్రూయిజ్ షిప్ లో 2వేల మంది ఉండగా అందులో 66 మందికి కరోనా సోకడంతో వారిని షిప్‌లోనే ఉంచారు.కరోనా వ్యాప్తి భయంతో క్రూయిజ్ షిప్‌ను గోవా పోర్టు ట్రస్టులోకి అనుమతించమని అధికారులు చెప్పారు. విహార నౌకలో 66 కరోనా కేసులు వెలుగుచూసిన నేపథ్యంలో ఈ నెల 3వతేదీ నుంచి 5వతేదీ వరకు ఓడల రాకపోకలను నిలిపివేయాలని గోవా పోర్టు ట్రస్టు నిర్ణయించింది. 


క్రూయిజ్ షిప్ లో ప్రయాణికులకు కరోనా సోకిన విషయాన్ని ఆరోగ్యశాఖ అధికారులు ముంబై పోర్టు ట్రస్ట్ సిబ్బందికి సమాచారం అందించారు. క్రూయిజ్ షిప్‌లోకి పీపీఈ కిట్లు ధరించిన ప్రత్యేక వైద్యబృందాన్ని పంపించామని వారు కొవిడ్ పరీక్షలు చేసి, రోగులకు చికిత్స అందిస్తున్నారని మంత్రి విశ్వజిత్ రాణే చెప్పారు. 


Updated Date - 2022-01-04T13:14:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising